ఆర్ఎక్స్ 100 , హిప్పీ, గుణ 369, 90 ఎంఎల్ తో హీరోగా టాలీవుడ్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న నటుడు కార్తికేయ.గ్యాంగ్ లీడర్ సినిమాతో విలన్ గా కూడా మెప్పించిన కార్తికేయకి అవకాశాలు భాగానే ఉన్నాయి.
ఈ కుర్ర హీరో ఊహించని విధంగా గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో చావుకబురు చల్లగా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి రావడానికి రెడీ అవుతున్నాడు.ఈ సినిమా గ్రాండ్ గా లాంచ్ అయ్యి షూటింగ్ కి వెళ్ళే టైంకి వాయిదా పడింది.
ఇందులో కార్తికేయకి జోడీగా లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తుంది.బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ సినిమాతో కౌశిక్ దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు.
ఇక లాక్ డౌన్ ముగింపు దశకి చేరుకోవడంతో షూటింగ్ లు మళ్ళీ ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి.ఈ నేపధ్యంలో లాక్ డౌన్ ముగిసిన వెంటనే షూటింగ్ కి వేగంగా కంప్లీట్ చేసుకోవాలని భావించిన దర్శకుడు దీనికోసం ఈ లాక్ డౌన్ టైంని ఉపయోగించుకుంటున్నాడు.
హీరో, హీరోయిన్ కోసం ఆన్ లైన్ వర్క్ షాప్లు నిర్వహిస్తున్నాడట.వర్క్ షాప్ లో లావణ్య, కార్తికేయ స్క్రిప్ట్ చదివి వారి పాత్రలకు సంబంధించిన సీన్స్ ను ఇద్దరు ప్రాక్టీస్ చేస్తున్నారని తెలుస్తుంది.
శవాలని తీసుకెళ్ళే అంబులెన్స్ డ్రైవర్ గా బస్తీ బాలరాజు పాత్రలో కార్తికేయ ఈ సినిమాలో కనిపించనున్నాడు.ఇక ఈ సినిమాతో ఎలా అయిన సాలిడ్ హిట్ కొట్టాలని కార్తికేయ చూస్తున్నాడు.
అది ఎంత వరకు వర్క్ అవుట్ అవుతుంది అనేది వేచి చూడాలి.