ఆన్లైన్ ఆర్డర్ పెట్టాడు.. కానీ అడ్రెస్ ఏంటంటే?

ప్రస్తుతం కరోనా కాలం నడుస్తుంది.అందుకే అందరూ ఆన్లైన్ బాట పట్టారు.

ప్రతి ఒక్కరు తమకు కావాల్సిన వస్తువులను ఆన్లైన్ లోనే కొంటున్నారు.ఇంకా ఈ నేపథ్యంలోనే ఓ వ్యక్తి తనకు కావాల్సిన వస్తువును ప్రముఖ ఈ కామర్స్ సంస్ద ఫ్లిప్ కార్ట్ లో ఆర్డర్ చేసాడు.

ఇంత వరకు బాగుంది.కానీ అతను పెట్టిన అడ్రెస్ ఏ అందరిని కామెడీకి గురిచేస్తుంది.

సాధారణంగా మనం ఆన్‌లైన్‌లో షాపింగ్‌ చేసేటప్పుడు ఇంటి అడ్రస్‌ ఇస్తం.ఇంకా ఇంటికి దగ్గరలో ఉన్న ల్యాండ్‌ మార్క్‌ అనే విభాగం దగ్గర ఏ స్కూలో లేదా థియేటరో లేదా గుడి పేరో ఇస్తాం.

కానీ రాజస్థాన్‌లోని కోటకు చెందిన ఓ కస్టమర్‌ మాత్రం అడ్రస్‌ రాయాల్సిన చోట ల్యాండ్‌మార్క్‌గా గుడి పేరును ప్రస్తావించాడు.

ఈ గుడి వద్దకు వచ్చి ఫోన్‌ చేస్తే తాను అక్కడికి వచ్చి వస్తువును తీసుకుంటానని చెప్పుకొచ్చాడు.

ఇంకా ఈ విషయాన్నీ ఫ్లిప్ కార్ట్ సంస్ద ట్విట్టర్ లో షేర్ చేసింది.

ఇంకా ఆ ఫోటోను చూసి ఎంతోమంది నెటిజన్లు ''ఎంతైనా ఇండియన్‌ ఈ-కామర్స్ భిన్నమంటూ'' కామెంట్లు పెడుతున్నారు.

ఇలాంటి అడ్రస్‌లు పెడుతారా? అంటూ మరికొందరు కామెంట్లు చేశారు.దీంతో ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

తలకిందులుగా దూసుకెళ్తున్న కారు.. వీడియో చూస్తే షాక్ అవుతారంతే..?