పిల్లలు పుట్టినప్పుడు కాదు తల్లిదండ్రులకు సంతోషం కలిగేది వారు ప్రయోజకులై కన్నవారిని కన్నుల్లో పెట్టుకుని చూసుకున్నప్పుడే.ఈ ఊపిరి పోయేవరకు తాను నిర్వహించే నిత్య కర్మలు సక్రమంగా నిర్వహించి, మరణించాక కూడా శ్రాద్ధకర్మలు సజావుగా చేసినప్పుడే కన్నవారి ఆత్మ శాంతించేది.
కానీ నేడు కరోనా వల్ల మరణిస్తున్న వారి ఆత్మలకు శాంతి అన్నదే కరువైయ్యింది.
ఈ వైరస్ వల్ల దగ్గరగా ఉన్న వారే దూరంగా ఉంటుంటే, మరి దగ్గరలేని మనుషుల కోసం ఆలోచించే వ్యర్ధం అనిపిస్తుంది.
ఇకపోతే ప్రస్తుత పరిస్దితుల్లో కరోనా కారణంగా తల్లిదండ్రులకు కూడా కర్మకాండలు నిర్వహించలేని దుస్దితి నెలకొంది.ఒక తల్లి అందరు ఉండి కూడా అనాధగా మరణించింది.చివరికి ఆ తల్లి కర్మకాండలు ఆన్ లైన్లో నిర్వహించడం బాధాకరం.
ఆ వివరాలు చూస్తే.
భీమవరంలో ఉంటున్న పద్మావతికి, భర్త, ఇద్దరు కుమారులు ఉన్నారు.కాగా భర్త, ఒక కుమారుడు బెంగళూరు, మరో కుమారుడు అమెరికాలో ఉంటున్నారు.
అయితే అనారోగ్య కారణంగా మరణించిన పద్మావతి 11వ రోజు కార్యక్రమాన్ని అమెరికా, బెంగళూరులో ఉన్న కుమారులు ఆన్లైన్ లో నిర్వహించడం విశేషం.