అమెరికాలో కరోనా ప్రభావం రోజు రోజుకి పెరుగుతోంది.అమెరికా వ్యాప్తంగా కొన్ని ప్రధానమైన నగరాలలలో లాక్ డౌన్ విధించారు.
ఎక్కడికక్కడ జనజీవనం స్థంభించి పోయింది.ప్రస్తుతం అమెరికాలో మృతుల సంఖ్య 39వేల పై మాటే.ఇక బాధితుల సంఖ్య సుమారు 7.50 లక్షలకి చేరుకుంది.దాంతో మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది ట్రంప్ ప్రభుత్వం.ఈ క్రమంలోనే ఎంతో మంది భారతీయులు కూడా ఇళ్లకే పరిమితమయ్యారు.
ఈ పరిస్థితులలో అమెరికాలోని భారత రాయబార కార్యాలయం ఆన్లైన్ లో కూచిపూడి నాట్యం నేర్చుకునేలా ఓ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.మన సనాతన సాంప్రదాయాలని విదేశాలలో సైతం కొనసాగించే భారతీయులు భారతీయ కళలలో తమ పిల్లలకి అమెరికాలో తర్ఫీదులు ఇప్పిస్తూ ఉంటారు.
కానీ ఈ విపత్కర సమయంలో బయటకి వెళ్ళలేని పరిస్థితుల నేపధ్యంలో ఇళ్లకే పరిమితం అవ్వడంతో.
లెర్న్ ఫ్రమ్ ది మాస్టర్స్ సిరీస్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది భారత రాయబార కార్యాలయం.దీనిలో భాగంగా ప్రముఖ క్లాసికల్ డ్యాన్సర్ భావనా రెడ్డి ఫేస్ బుక్ లైవ్ ద్వారా వారంలో రెండు రోజులు అంటే మంగళ వారం, గురువారం లలో క్లాసులు నిర్వహిస్తున్నారు.దాంతో అప్పటికే డ్యాన్స్ నేర్చుకుంటున్న ఎన్నారైలు, నేర్చుకోవాలని ఆసక్తి చూపుతున్న ఎన్నారైలు అందరూ ఈ కార్యక్రమం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.