ఉల్లి ధరలు మళ్లీ భగ్గుమంటున్నాయి.లాక్డౌన్ కాలంలో కేజీ ఉల్లి ధర సెంచరీ కొట్టగా.తాజాగా మరోసారి కేజీ ఉల్లి ధర రూ.100కి చేరుకుంది.దీంతో సామాన్య, మధ్య తరగతి ప్రజల జేబులకు చిల్లులు పడుతున్నాయి.అంత ధర పెట్టి ఉల్లిపాయలు కొనలేని పరిస్థితి నెలకొంది.ఉల్లిపాయల ధరలు పెరగడం ఇదే తొలిసారి కాదు.ప్రతిసారి ఉల్లి ధరలు పెరుగుతూ.
తగ్గుతూ ఉంటాయి.ఇలాంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా.
ఉల్లి ధరలు మాత్రం తగ్గుముఖం పట్టవు. ఉల్లి ధరలు పెరుగుతున్న క్రమంలో వాటి ఎగుమతిపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది.
అయితే ఉల్లి ధరలు రూ.100కి పెరిగినందువల్ల ప్రజలకు తక్కువ ధరకు వాటిని అందించేందుకు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో రూ.40కే రైతు బజార్లలో కేజీ ఉల్లిపాయలను అందిస్తామని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.దీంతో ప్రజలకు ఊరట కలిగించేలా తక్కువ ధరకు ఉల్లిని అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కూడా ముందుకొచ్చింది.తాము కేజీ రూ.35కే ఉల్లిని అందిస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.
ప్రతి వ్యక్తికి రెండు కిలోల చొప్పున ఉల్లిపాయలు అందిస్తామని, తీసుకునేటప్పుడు ఏదైనా గుర్తింపు కార్డు చూపించాలని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది.
భారీ వర్షాలకు పలు రాష్ట్రాల్లో ఉల్లి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది.దీని వల్ల ఉల్లికి భారీ డిమాండ్ ఏర్పడింది.