కొత్తగా పెళ్లి చేసుకునే జంటకు వారి స్నేహితులు, బంధువులు బహుమతులు ఇవ్వడం ఆనవాయితీ.అయితే అవి వారి వారి స్థాయిని బట్టి ఒక్కోరకమైన బహుమతులు అందజేస్తారు స్నేహితులు.
కానీ ఓ కొత్త జంటకు వారు పెట్టిన విందులో ఉల్లిపాయ లేదని తెలిసి, ఆ స్నేహితులు చేసిన పనికి అక్కడున్నవారు అవాక్కయ్యారు.
తమిళనాడులోని కడలూరులోని మంజకుప్పంలో షాహుల్, సబ్రినా అనే జంట వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.
ఇరు కుటంబ సభ్యులు వచ్చిన అతిథులకు మంచి విందును ఏర్పాటు చేశారు.అందులో ప్రత్యేకించి బిర్యానీ చేయించారు.
అయితే బిర్యానీలోకి ఉల్లికి బదలు కీరా, రైతా వేసినట్లు తెలిపారు.ఇది తెలుసుకున్న వరుడి స్నేహితులు స్థానికంగా 2.5 కిలోల ఉల్లిపాయలు కొని కొత్త జంటకు బహుమతిగా అందించారు.
బిర్యానీలోకి ఉల్లిపాయ లేకపోతే అది ఎలా తినాలంటూ వారు ప్రశ్నించలేదు.
కానీ వారు చేసిన పనికి వధువు బంధువులు సిగ్గుతో తలదించుకున్నారు.అయితే పెరిగిన ఉల్లి ధరను తాము భరించలేకే ఈ ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసినట్లు వారు చెప్పుకొచ్చారు.
ఏదేమైనా స్థానికంగా ఈ ఘటన వైరల్గా మారింది.