ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉల్లి మంటలు ప్రజలకు కన్నీరు తెప్పిస్తున్నాయి.ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటడంతో ప్రజలు ఉల్లిని కొనాలంటేనే భయపడుతున్నారు.
కాగా ఉల్లి కోసం గుజరాత్లోని ప్రజలు మాత్రం రోడ్డుపై ఎగబడ్డారు.గుజరాత్లోని రాజ్కోట్ జిల్లా గొండల్ హైవేపై ఉల్లి కోసం ప్రజలు తోపులాట చేశారు.
ఉల్లిపాయలతో వెళ్తున్న ఓ ట్రాక్టర్ హైవేపై రోడ్డుపై పల్టీ కొట్టడంతో ఈ విషయం తెలుసుకున్న చుట్టు పక్కల గ్రామాల ప్రజలు దొరికిందే అవకాశమని ఉల్లిని తెచ్చుకునేందుకు ఎగబడ్డారు.ప్రస్తుతం ఉల్లి ధరను కొనాలంటే భయపడుతున్న జనం, అది ఉచితంగా వస్తుందంటే వదులుతారా అని పరుగులు తీసారు.
దొరికిన ఉల్లిని దొరికినట్లు చేజిక్కించుకున్నారు.
అక్కడ ప్రజలు పరుగులు తీయడం చూసిన ఓ వ్యక్తి అదంతా తన సెల్ఫోన్ కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
దీంతో ఇప్పుడు ఆ వీడియో వైరల్గా మారింది.ఉల్లి కోసం ఆ పరుగులు ఏమిటి సిల్లీ అంటూ నెటిజన్లు కొంతమంది కామెంట్ విసురుతున్నారు.