కరోనా వైరస్ దెబ్బకి మూతపడ్డ పాఠశాలలు మెల్లమెల్లగా ఓపెన్ అవుతున్నాయి.వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి రావడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూతపడ్డ ప్రాథమిక పాఠశాలలను రీ ఓపెన్ చేయడానికి ప్రభుత్వం డిసైడ్ అయింది.
రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల తీవ్రత తగ్గటంతో.సరికొత్త నిబంధనలు, జాగ్రత్తలు పాటిస్తూనే పాఠశాలలు తెరవాలని ఏపీ విద్యాశాఖ డిసైడ్ అయింది.
ఈ క్రమంలో ఫిబ్రవరి మొదటి తారీకు నుంచి ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకు బడులు ఓపెన్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ముఖ్యంగా పాఠశాలలో విద్యార్థుల సంఖ్య అదేవిధంగా ఉపాధ్యాయుల సంఖ్య ఆధారంగా ఎంతమంది పిల్లలు హాజరవ్వాలి ఇటువంటి సమయాల్లో ఏ ఏ తరగతులు నిర్వహించాలి అన్నదానిపై యాజమాన్యం టైం టేబుల్ పాటించాలని సూచించింది.
అంతేకాకుండా ప్రతి తరగతిలో 20 మంది విద్యార్థులు మాత్రమే ఉండేలా చర్యలు తీసుకోవాలని.పాఠశాల భవనాలు సరిపడని చోట రోజు విడిచి రోజు తరగతులు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ సూచించారు.