ప్రేమలో పడటం తప్పు కాదు.కానీ ఆ ప్రేమ పొందలేనప్పుడు రాక్షసంగా ఆలోచించడం క్షమించరాని నేరం.
అందులో తన ప్రేమ కోసం తోటి వారి ప్రాణాలు తీయడం మరీ దారుణం.ఓ యువకుడు తన వన్ సైడ్ లవ్ కోసం క్షమించరాని ఘోరం చేశాడు.
తన ప్రేమను పొందలేదు సరికదా ముగ్గురి ప్రాణాలు తీశాడు.యూపీలో జరిగిన ఈ ఘటన గురించి తెలుసుకుంటే.
యూపీలోని ఉన్నావ్ జిల్లా పఠాక్పూర్ గ్రామానికి చెందిన లంబూ(18) అనే యువకుడు అదే గ్రామంలో ఉంటున్న ఓ అమ్మాయిని గత కొంతకాలంగా ప్రేమిస్తున్నాడట.అయితే ప్రేమ వ్యవహారాలు ఇష్టం లేని ఆ యువతి ఇతడి ప్రేమను నిరాకరించిందట.
ఈ క్రమంలో ఆ యువతిని చంపాలని నిర్ణయించుకున్న లంబూ వాటర్ లో విషం కలిపి ఆ యువతి దగ్గరికి తీసుకెళాడట.
కాగా ఇద్దరి పొలాలు పక్కపక్కనే ఉండటంతో, అదే పోలంలో ఇతను ప్రేమించిన యువతి ఉంది.
కానీ ఆ యువతితో పాటుగా ఇద్దరు సోదరీమణులు కూడా ఉన్నారట.ఇక లంబూ ఇచ్చిన నీళ్లు ఆ యువతి తాగిన తర్వాత మిగతా ఇద్దరు కూడా తాగారట.
కాసేపటికే ముగ్గురి నోట్లో నుంచి నురగ రావడంతో తీవ్ర భయాందోళనకు గురైన ఆ యువకుడు అక్కడ్నుంచి పారిపోయాడు.ఈ ఘటనలో ఇద్దరు మరణించగా ఇతను ప్రేమించిన యువతి ప్రాణాపాయంలో ఉందట.