నిన్న జరిగిన చంద్రయాన్ 2 ప్రయోగం తుది అంకంను బెంగళూరులోని స్పెస్ సెంటర్లో కూర్చుని చూసేందుకు దేశ వ్యాప్తంగా రాష్ట్రానికి ఇద్దరు విద్యార్థుల చొప్పున ఇస్రో అవకాశం ఇచ్చింది.పలు క్విజ్ కార్యక్రమాలు నిర్వహించి అందులో గెలుపొందిన వారికి ఈ ఛాన్స్ ఇచ్చిన విషయం తెల్సిందే.
ఆ విద్యార్థులు ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి ఈ ప్రయోగాన్ని విక్షించారు.చంద్రయాన్ 2 ప్రయోగం చివరి క్షణాల్లో ల్యాండర్ విక్రమ్లో సాంకేతిక సమస్య రావడంతో స్పెస్ సెంటర్తో కనెక్షన్స్ తెగి పోయింది.
ఆ సమయంలో విద్యార్థులు నిరుత్సాహపడకుండా వారిలో పీఎం మోడీ స్ఫూర్తిని నింపారు.</br>
ఆ సమయంలో విద్యార్థులతో మోడీ ముచ్చటించారు.
ఆ సమయంలో ఒక విద్యార్థి మోడీతో మాట్లాడుతూ ”మోడీజీ నాకు రాష్ట్రపతి అవ్వాలని ఉంది, దాన్ని చేరుకోవడం ఎలా’ అంటూ ప్రశ్నించాడు.ఆ విద్యార్థి ప్రశ్నకు మోడీ నవ్వుతూ రాష్ట్రపతి ఎందుకు ప్రధాని అవ్వాలని ఎందుకు లేదు అంటూ ప్రశ్నించాడు.
ఆ విద్యార్థి ప్రశ్నకు సమాధానంగా నీవు అనుకున్నదాన్ని సాధించేందుకు నీ లక్ష్యంను చిన్న భాగాలుగా విభజించి ఆ తర్వాత సాధించు.ఆ క్రమంలో నీవు ఎదుర్కొన్న అపజయాలను మర్చి పో అంటూ సూచించాడు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ విద్యార్థి ప్రశ్న తెగ వైరల్ అవుతోంది.ఆ విద్యార్థి ప్రశ్నకు మోడీ చెప్పిన సమాధానం అమోగం అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.