తెలంగాణలో సంచలనం సృష్టించిన ఓటుకి నోటు కేసు విచారణ ప్రస్తుతం కొనసాగుతూ వుంది.ఈ కేసులో ఇప్పటికే టీడీపీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, అప్పటి టీడీపీ నేత రేవంత్ రెడ్డి పై ఆరోపణలు వచ్చాయి.
ఓటుకి నోటు సంబంధించి స్పష్టమైన వీడియో టేప్ బయటపడటంతో అప్పటి టీఆర్ఎస్ పోలీసులు కేసు ఫైల్ చేసారు.దీనిపై సిబిఐ విచారణ చేస్తుంది.
ఇప్పటికే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న స్టీఫెన్ సన్, సెబాస్టియన్ ని పోలీసులు విచారించారు.
ఇదిలా వుంటే ఈ ఓటు కి నోటు కేసులో తదుపరి విచారణ కోసం రేవంత్ రెడ్డికి కూడా నోటీసులు జారీ చేసారు.
అలాగే చంద్రబాబుకి కూడా నోటీసులు రాజీ చేసే అవకాశం వున్నట్లు తెలుస్తుంది.అయితే ఈ కేసు విచారణ జరుగుతున్నా టైంలో ఊహించని విధంగా ఓటుకి నోటు వ్యవహారంకి సంబంధించి మరో వీడియో టేప్ బయటకి వచ్చింది.
ఇందులో స్టీఫెన్ సన్, సెబాస్టియన్ సంభాషణలు వున్నాయి.వీటిలో బాబు తనకి 3.5 కోట్లు ఆఫర్ చేసారని, అయితే తాను 5 కోట్లు డిమాండ్ చేయడం జరిగింది అని, దానికి బాబు ఒప్పుకున్నారని సీఫెన్ సన్ చెబుతున్నట్లు ఆడియో వుంది.మరి దీన్నిపై పోలీసులు ఎలా విచారిస్తారు అనేది చూడాలి.