ఈ మధ్యకాలంలో సినిమా పరిస్థితి పూర్తిగా మారిపోయింది.సినిమా చూసేవాడికి ఎప్పుడు కొత్తదనమే కావాలి.
తీసే కథలో, ఆ కథనంలో దాంట్లో నటించే తారాగణంలో అలాగే యాక్షన్ సీన్స్, సంగీతం, డాన్సులు అన్నీ కూడా భిన్నంగా కనిపిస్తే తప్ప జనాలు ఆ సినిమాను చూడటం లేదు.అత్యంత వేగంగా సినిమాలను పూర్తి చేయాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు.
అంతేకాదు ప్రతి సినిమా పాన్ ఇండియా సినిమా కావాలి నడుస్తున్నాయి కాబట్టి అంత గ్రిప్పింగ్ ఉంటే తప్ప జనాల ఆదరణ పొందడం కష్టం.పైగా ఫ్యాన్ ఇండియా సినిమా అంటే కచ్చితంగా దాదాపు ఒక పది భాషల వరకు డబ్బింగ్ చేయాల్సి వస్తుంది.
కేవలం ఒక సినిమాలో ఒక హీరో ఉండాలనే కాన్సెప్ట్ రోజు రోజుకు తగ్గుతూ వస్తుంది ఒక సినిమాలో ఇద్దరు లేదా ముగ్గురు హీరోలు ఉంటే అది బాగా వర్క్ అవుట్ అని మేకర్స్ ఆలోచిస్తున్నారు.పైగా పలు భాషల్లో డబ్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా మిగతా భాషల హీరోలు కూడా ఒకే సినిమాలో ఉంటే అది ఆయా భాషలకు బూస్టప్ అయ్యే అవకాశం ఉంటుంది.
ఇక అసలు విషయం ఏమిటి అంటే ఇలా మల్టీ హీరోల కాంబినేషన్ లో సినిమా ఒకటి చేయాలి అని మలయాళ సినిమాల నిర్మాత అయినా లిజో జోస్ ఆలోచించి మోహన్ లాల్ తో మొదట ఓకే చేయించాడు.
అంతే కాదు సినిమా పేరు మలైకొట్టయ్ వలిబన్. మోహన్ లాల్ తో లీజో జోస్ మంచి యాక్షన్ థ్రిల్లర్ తీయాలని భావించారు.ఇక అప్పటికే కంతార సినిమాతో రిషబ్ ప్యాన్ ఇండియా స్టార్ గా ఎదిగిపోయాడు కాబట్టి ఈ చిత్రం లో అతడిని కూడా ఇన్వాల్వ్ చేశాడు.
ఇప్పటివరకు ఎలాంటి మలయాళ సినిమా కూడా చేయలేదు కాబట్టి అతనికి ఇది మొదటి సినిమా అవుతుంది.మోహన్ లాల్ రిషబ్ శెట్టి ఇద్దరు కలిసి నటిస్తే ఎంతసేపు మనం ఈ విషయం గురించి ఎందుకు చర్చిస్తాను చెప్పండి
దీంట్లో మరొక స్టార్ హీరో కూడా జాయిన్ అవుతున్నారు.ఇక దీంట్లో కమలహాసన్ సైతం ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడట చాలా ఏళ్ల క్రితం మోహన్ లాల్, కమల్ హాసన్ కలిసిన నటించారు ఆ తర్వాత ఎన్నో ఏళ్లకు మోహన్ లాల్ తో, కమల్ కి మళ్ళీ ఒక సినిమా రావడం రెండు భాషల వారికి ఎంతో ప్రత్యేకమైన చెప్పాలి ఇక రిషబ్ శెట్టి, కమల్ హాసన్, మోహన్ లాల్ ఈ ముగ్గురు కలిస్తే ఇంకేముంది చెప్పండి స్టేటస్ వచ్చేసినట్టే కదా.