యంగ్రెబల్ స్టార్ ప్రభాస్ వరుసపెట్టి పాన్ ఇండియా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు.బాహుబలి 1,2, సాహో లాంటి పాన్ ఇండియా సినిమాలతో తిరుగులేని పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకున్న ప్రభాస్ ఇప్పుడు నెక్ట్స్ మూడు ప్రాజెక్టులు కూడా పాన్ ఇండియా ప్రాజెక్టులనే లైన్లో పెట్టాడు.
ప్రస్తుతం చేస్తోన్న రాధేశ్యామ్, నాగ్ అశ్విన్ సైన్స్ఫిక్షన్ ప్రాజెక్టు, ఓం రౌత్ ఆదిపురుష్ అన్ని కూడా భారీ బడ్జెట్తో పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కుతున్న సినిమాలే.
ఇక రాధేశ్యామ్ తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ నిర్మించే భారీ సైన్స్ఫిక్షన్ ప్రాజెక్టులో నటిస్తున్నాడు.రూ.200 కోట్ల భారీ బడ్జెట్తో ఈ క్రేజీ ప్రాజెక్టు తెరకెక్కుతోన్నట్టు వార్తలు వస్తున్నాయి.ఈ సినిమాలో ప్రభాస్కు బిజినెస్ / లాభాల్లో వాటా ఇచ్చేలా ఒప్పందం కుదిరిందని.ప్రభాస్కు రూ. 70 కోట్ల వరకు రెమ్యునరేషన్ ముడుతుందని అంటున్నారు.ఇక బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ దీపికా పదుకొనే ప్రధాన హీరోయిన్.ఆమెకు రూ.25 కోట్ల వరకు ఇచ్చేలా అగ్రిమెంట్ ఓకే అయ్యిందట.ఈ సినిమా కోసం దీపిక ఎక్కవ కాల్ షీట్లే ఇచ్చిందంటున్నారు.
ఇక మరో కీలక పాత్రకు నివేదా థామస్ను ఎంపిక చేశారని సమాచారం.
ఈ వార్తలు ఇప్పటికే బయటకు వచ్చాయి.నివేద ప్రభాస్ చెల్లిగా చేస్తుందని రూమర్లు కూడా వచ్చాయి.
ఇదిలా ఉంటే ఈ క్రేజీ ప్రాజెక్టులో ఓ హాట్ ఐటెం సాంగ్ ఉందట.ఈ సాంగ్లో ప్రభాస్ పక్కన డ్యాన్స్ చేసే ఛాన్స్ ఇస్మార్ట్ శంకర్ సినిమాలో హాట్ హాట్ అందాలతో రచ్చ చేసిన నిధి అగర్వాల్కు దక్కిందంటున్నారు.
నాగ్ అశ్విన్ స్వయంగా నిధి పేరును ఫైనలైజ్ చేశాడని.ఈ స్పెషల్ సాంగ్లో మాత్రమే ఆమె నటిస్తుందని తెలుస్తోంది.ఏదేమైనా ముగ్గురు ముద్దుగుమ్మలతో ప్రభాస్ ఆటా, పాటకు రెడీ అవుతున్నాడు.2022లో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.