డీజే టిల్లు సినిమా సక్సెస్ తో ఓవర్ నైట్ లో హీరో సిద్ధు జొన్నలగడ్డ పేరు మారుమ్రోగింది.ఈ సినిమాకు ముందు పలు సినిమాలలో నటించినా డీజే టిల్లు సక్సెస్ ఆయన కెరీర్ కు ప్లస్ అయింది.
డీజే టిల్లు సినిమాకు సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ పేరుతో సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాలో హీరోయిన్ల మార్పు చర్చనీయాంశం అవుతోంది.మొదట ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీలను ఎంపిక చేయడం జరిగింది.
వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న శ్రీలీల మొదట ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఆ తర్వాత ఈ సినిమా నుంచి తప్పుకున్నారు.ఆ తర్వాత ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా ఎంపికైనట్టు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.
చేతిలో ప్రస్తుతం పరిమితంగా ఆఫర్లు ఉన్న అనుపమ కూడా ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.అయితే కొన్నిరోజుల తర్వాత అనుపమ కూడా ఈ మూవీ నుంచి తప్పుకుంది.
ఈ ఇద్దరు హీరోయిన్లు తప్పుకున్న తర్వాత ఈ సినిమాలో ప్రేమమ్ బ్యూటీ మడోన్నా సెబాస్టియన్ పేరు వినిపించగా ఇక హీరోయిన్లలో మార్పు ఉండదని ఈమెనే ఫైనల్ అని చాలామంది భావించారు.అయితే విచిత్రం ఏంటంటే ఈ స్టార్ హీరోయిన్ కూడా ఈ సినిమా నుంచి తప్పుకుందని తెలుస్తోంది.కొంతమంది మాత్రం ఈ సినిమా నుంచి హీరోయిన్ తప్పుకోలేదని తప్పించారని కామెంట్ చేస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
మీనాక్షి చౌదరితో ఈ హీరోయిన్ల వేట గుతుందో లేక ఈ హీరోయిన్ ను కూడా సినిమా నుంచి తప్పిస్తారో చూడాల్సి ఉంది.మీనాక్షి చౌదరి కూడా ఈ సినిమాలో నటించకపోతే ఈ మూవీలో హీరోయిన్ ను ఎంపిక చేయడం కష్టమని చెప్పవచ్చు.
సిద్ధు జొన్నలగడ్డ వల్లే ఈ సమస్య వచ్చిందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.