బిగ్ బాస్ కంటెస్టెంట్ నూతన్ నాయుడు శిరోముండనం కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.అయితే పోలీసుల విచారణలో తీగ లాగితే దొంకంతా కదులుతోంది.
నూతన్ నాయుడు చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.ఇద్దరు ఉద్యోగులు తాజాగా బ్యాంకు ఉద్యోగాల పేరుతో నూతన్ నాయుడు తమను మోసం చేసినట్లు ఫిర్యాదు చేశాడు.
తమ నుండి నూతన్ నాయుడు 12 కోట్ల రూపాయలు వసూలు చేశాడని చెప్పారు.
శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం, నూకరాజు అనే వ్యక్తి సీసీ కెమెరాల వ్యాపారం చేసేవాళ్లు.
వీళ్లలో నూకరాజు విశాఖ జిల్లా రావికమతం ప్రాంతానికి చెందిన వ్యక్తి కాగా శ్రీకాంత్ రెడ్డి తెలంగాణలోని చేవెళ్ల ప్రాంతానికి చెందిన వారు.వీరికి వ్యాపార లావాదేవీల్లో బాగంగా నూతన్ నాయుడుతో పరిచయం ఏర్పడింది.
కొన్ని రోజులకు వీళ్లకు నూతన్ నాయుడుకు మధ్య స్నేహం కుదిరింది.
సౌత్ ఇండియా ఎస్బీఐ రీజియన్ మేనేజర్ పోస్ట్ ఇప్పిస్తానని చెప్పి శ్రీకాంత్ రెడ్డితో 12 కోట్ల రూపాయలు, ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి నూకరాజు దగ్గర 5 లక్షల రూపాయలు నూతన్ నాయుడు వసూలు చేశాడు.
అయితే డబ్బులిచ్చి రెండేళ్లు గడిచినా ఉద్యోగాలు రాలేదని శ్రీకాంత్ రెడ్డి, నూకరాజు వాపోతున్నారు.బాధితుల ఫిర్యాదు ఆధారంగా మహారాణి పేట సీఐ సోమశేఖర్ కేసు నమోదు చేసుకున్నారు.
అయితే శ్రీకాంత్ రెడ్డికి నిజంగానే 12 కోట్ల రూపాయలు ఇచ్చే కెపాసిటీ ఉందా…? లేదా…? అని తెలుసుకునే పనిలో పోలీసులు పడ్డారు.పోలీసులు నూతన్ నాయుడు తో పాటు అతనికి సన్నిహితుడైన శశికాంత్ అనే వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
నూతన్ నాయుడు చేసిన మరిన్ని అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తూ ఉండటం గమనార్హం.