మహమ్మారి కరోనా తీసుకొచ్చిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు.కరోనా కారణంగా.
ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలతో ఎక్కడికక్కడ ఆర్థిక లావాదేవీలు ఆగిపోవటం మాత్రమే కాక షాపింగ్ మాల్స్ ఇంకా చాలా సంస్థలు క్లోజ్ అయిపోయిన పరిస్థితి.ఇటువంటి తరుణంలో ఉద్యోగస్తులు కూడా ఉద్యోగాలకు వెళ్లలేని.
పరిస్థితులు నెలకొని ఉండటం తో.మరోపక్క బిజినెస్ ఆగిపోవటంతో లక్షలాదిమంది దేశవ్యాప్తంగా తమ ఉద్యోగాలను కోల్పోయారు.కేవలం మే నెలలోనే కొన్ని మిలియన్ల ఉద్యోగాలు ఇండియాలో కొంతమంది కోల్పోవటం జరిగిందని ప్రముఖ మీడియా సంస్థ ఇటీవల వార్తలలో తెలియజేశాయి.
ఇదిలా ఉంటే బెంగళూరు మహానగరంలో కూడా కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేయడంతో అక్కడ షాపింగ్ మాల్స్ అన్నీ కొన్ని నెలలపాటు క్లోజ్ అయిపోవడంతో అక్కడ దాదాపు లక్ష మందికి పైగా ఉద్యోగాలను కోల్పోవటం జరిగిందట.
ఈ నేపథ్యంలో షాపింగ్ మాల్స్ అసోసియేషన్ .ప్రభుత్వాలు తమను ఆదుకోవాలని గుజరాత్ రాష్ట్రంలో నష్టపోయిన షాపింగ్ సెంటర్లకు ఇచ్చిన రాయితీలు .ఇక్కడ కూడా కల్పించాలి అంటూ సీఎం ఎడ్యూరప్ప కు లెటర్ రాయటం జరిగింది.గుజరాత్ లో ఉన్నది బీజేపీ ప్రభుత్వం అక్కడ కల్పించిన రాయితీలు ఇక్కడ కూడా కల్పించాలి అని బెంగళూరు షాపింగ్ యాజమాన్యాలు కర్ణాటక బిజెపి ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.