పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే దాకా మన జీవితంలో సోషల్ మీడియా అనేది ఒక భాగం అయిపోయింది.మరీ ముఖ్యంగా ఫేస్బుక్, ఇన్ స్టాగ్రామ్లు ఎంతలా ఫేమస్సో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
అయితే ఇప్పుడు సోషల్ మీడియాను ఏలుతున్న ఫేస్ బుక్ పై వ్యతిరేక గళం మొదలైంది.మిగతా సోషల్ మీడియాలో వేదికల్లో ఫేస్ బుక్పై తీవ్ర వ్యతిరేక ఉద్యమం నడుస్తోంది.
ఈ ఫేస్ బుక్ తో పాటు ఇన్ స్టాగ్రామ్ యాప్ల నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఒక్కరోజు లాగవుట్ అయి వీటిపై నిరసన గళం వినిపించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఫేస్ బుక్ యాప్ లో కొన్ని మార్పులు చేయడంతో పాటు జూకర్ బర్గ్ ఐ కూడా వ్యతిరేకత వస్తోంది.
ఆయన్ను ఫేస్ బుక్కు సీఈవో పదవి నుంచి తప్పించాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేయడం మనం చూడొచ్చు. ఇక సోషల్ జస్టిస్ అంతర్జాతీయ పౌర హక్కుల సంఘాలు ఈ విధమైన నిరసన పోరాటానికి పిలుపునిస్తున్నాయి.
వీరంతా కలిసి వచ్చే నవంబర్ 10న తారీఖున ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫేస్ బుక్ అలాగే ఇన్ స్టాగ్రామ్ యూజర్లు వాటిని బహిష్కరించి ఈ విధమైన పోరాటానికి మద్దతు తెలిపాలిన కోరుతున్నాయి.
అయితే ఈ పోరాటం ఎందుకంటే ఇంటర్నెట్ లో ఫేస్ బుక్ యాప్ చేస్తున్న కొన్ని బాధ్యతారాహిత్య పనుల కారణంగా వ్యక్తుల వ్యక్తిగత విషయాలను చోరీకి గురవుతున్నాయని పౌరహక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి.కాపిటోల్ దాడిని ఉటంకిస్తూ ఈ విధమైన పోరాటానికి తెరలేపాయి.దీంతో పాటు మరికొన్ని దేశాల్లో ఈ మధ్య జరిగిన కొన్ని ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను చూపిస్తూ కైరోస్ సంస్థ పోరాటాన్ని ప్రారంభించగా ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఈ ఉద్యమం ఊపందుకుంది.
ఈ పోరాటం ద్వారా ఫేస్ బుక్ ను వైషమ్యాల విషయంలో కంట్రోల్ చేయడేమ ప్రధాన ఉద్ధేశం అని చెబుతున్నారు.
.