చిన్న, పెద్ద అనే తేడా లేకుండా కరోనా మహమ్మారి మరింత రెట్టింపు తో తీవ్రంగా మారింది.ఎక్కడ చూసినా ఈ వైరస్ పేరు తప్ప మరి ఏమి వినపడటం లేదు.
రోజుకు లక్షల సంఖ్యలో కేసులు పెరుగుతున్నాయి.రోజుకు మరణాలు పెరుగుతున్నాయి.
ఇక సరైన వైద్య సదుపాయాలు కూడా లేని పరిస్థితి గా మారింది మన దేశం.ఈ క్లిష్టమైన పరిస్థితిలో ఎటువంటి సదుపాయాలు లేక పోయేసరికి ఒక ఏడాదిన్నర చిన్నారి గంటకుపైగా అంబులెన్స్ లోనే ప్రాణాలు వదిలేసింది.
విశాఖ కేజీహెచ్ హాస్పిటల్లో తమ చిన్నారికి వైద్యం అందించాలని తల్లిదండ్రులు అంబులెన్స్ లో కేజీహెచ్ హాస్పిటల్ కు తీసుకు వచ్చారు.ఇక అక్కడ బెడ్స్ ఖాళీగా లేవంటూ అంబులెన్స్ లోనే గంటకుపైగా వెయిట్ చేయించారు కేజీహెచ్ సిబ్బందులు.
ఇక ఆ చిన్నారి గంటకుపైగా ప్రాణాలతో పోరాడి చివరికి లోకాన్ని వదిలి వెళ్ళింది.
అసలు ఏం జరిగిందంటే చిన్నారికి ఆరోగ్యం బాగా లేనందున నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి చికిత్సకోసం తీసుకెళ్లారు తల్లిదండ్రులు.
ఇక అక్కడ రెండు రోజుల పాటు చికిత్స అందగా.అక్కడే ఆ చిన్నారికి కరోనా సోకింది.
దీంతో చిన్నారికి కరోనా ఉందని, పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని మరో హాస్పిటల్ కి తీసుకెళ్లాలని ఆ ప్రైవేట్ ఆసుపత్రి అధికారులు సూచించారు.దీంతో అక్కడ చికిత్స అందిన రోజుల డబ్బులను వసూలు చేసుకొని అక్కడి నుండి తరలించారు.
ఇక ఏమీ చేయలేక తల్లిదండ్రులు తమ చిన్నారి ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం కేజీహెచ్ కు తీసుకొని రాగా సరైన సదుపాయాలు లేకపోవడంతో ఆ చిన్నారి ప్రాణాలను వదిలేసింది.ఇక ఆ తల్లిదండ్రులు ఇక తమ చిన్నారి లేదని గుండెలు పగిలేలా కన్నీరుమున్నీరయ్యారు.