మరోసారి పుల్వమా లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు! భద్రతా దళాలపై కాల్పులు!

జమ్ము కాశ్మీర్ పుల్వామా జిల్లాలో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు.పింగలాస్ ప్రాంతంలో ఓ ఇంట్లోకి చొరబడిన ఉగ్రవాదులు భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకుని కాల్పులకు తెగబడ్డారు.

 Once Again Terrorist Attacks In Pulwama District-TeluguStop.com

దీంతో ఉగ్రవాదుల ఉనికిని పసిగట్టిన భద్రత దళాలు కూడా ఎదురు కాల్పులు మొదలెట్టాయి.ఈ కాల్పుల్లో ఒక మేజర్ సహా నలుగురు జవాన్లు మృతి చెందినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే 44 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించి విషాదం లో ఉన్న భారత ప్రజలకు ఇది మరో విషాదకర వార్త.

ప్రస్తుతం ఆ ప్రాంతంలో భద్రతా దళాలు ఉగ్రవాదులకు మధ్య భీకర కాల్పులు జరుగుతున్నట్లు సమాచారం.

సీఆర్పీఎఫ్ జవాన్ పై జరిగిన దాడికి ప్రతీకార చర్యలకు సిద్ధమౌతున్న తరుణంలో మరో సారి రెచ్చగొట్టే విధంగా ఉగ్రవాదులు ఈ కాల్పులకు పాల్పడినట్లు తెలుస్తోంది.ఇప్పటికే విపరీతమైన కోపంతో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ జవాన్ మృతి మరో సారీ అగ్నికి ఆజ్యం పోసినట్లయింది.

దీంతో ఎట్టి పరిస్థితుల్లో పాకిస్థాన్పై, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదంపై గట్టి చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube