సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా రావాలని, రాబోతుందని గత పదేళ్ల కాలంగా ప్రచారం జరుగుతోంది.2010 సంవత్సరంలో వీరిద్దరి కాంబోలో ఖలేజా వచ్చింది.ఆ సినిమా డిజాస్టర్ అయినా కూడా మళ్లీ అభిమానులు వీరి కాంబో కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.వీరిద్దరు కలిసి వర్క్ చేస్తే చూడాలని ప్రతి ఒక్కరు ఆశిస్తున్నారు.
ఈ విషయంలో వారు మాత్రం చాలా లైట్ గా ఉన్నట్లుగా అనిపిస్తుంది.
అతడు మరియు ఖలేజా సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశ పర్చినా కూడా టీవీలో మాత్రం రెండు సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.
అలాగే ఇద్దరికి కూడా మంచి స్టార్ డం ఉంది.కాంబోకు మంచి పేరుంది.
అందుకే మళ్లీ వీరిద్దరు కలిస్తే ఇండస్ట్రీ హిట్ ఖాయం అంటూ అభిమానులు చాలా నమ్మకంతో ఉన్నారు.కాని వీరిద్దరు మాత్రం అదుగో ఇదుగో అంటూ ఊరిస్తూ వస్తున్నారు.
గతంలో పలు ఇంటర్వ్యూల్లో త్రివిక్రమ్ మాట్లాడుతూ మహేష్తో సినిమా చేస్తాను అన్నాడు.
ఇప్పుడు వీరి కాంబో మూవీ మళ్లీ ప్రచారం జరుగుతోంది.
వీరిద్దరి కాంబోలో కొత్త సినిమాకు చర్చలు జరుగుతున్నాయి.రెండుమూడు సంవత్సరాల్లో వీరిద్దరి కాంబోనే మనం చూడబోతున్నాం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.
ఆ విషయంలో క్లారిటీ అయితే లేదు.కాని వీరి కాంబోలో సినిమా వస్తే బాగుంటుందని ఎదురు చూస్తున్న వారికి ఈ వార్త చాలా ఆనందాన్ని కలిగిస్తుంది.
మరి వీరి కాంబో నిజంగానే మళ్లీ వర్కౌట్ అయ్యేనా చూడాలి.