బిగ్ బాస్ సీజన్ 4లో నిన్న ఎలిమినేషన్కు నామినేషన్ జరిగాయి.ఎప్పటికంటే ఈసారి విభిన్నంగా ఎవరికి వారు ఎలిమినేషన్ కు నామినేట్ అయ్యేలా బిగ్బాస్ ప్లాన్ చేశాడు.
గార్డెన్ ఏరియాలో ఒక పడవను ఏర్పాటు చేసి అందులో మొత్తం కంటెస్టెంట్స్ కూర్చోవాలని అన్నాడు.లాస్య కెప్టెన్ కారణంగా ఆమెకు ఎలిమినేషన్ నుండి ఉపశమనం దక్కింది.
పడవలో కూర్చున్న వారిలో నుండి మొదటగా ఏ 9 మంది బయటకు దిగుతారో వారు ఎలిమినేషన్కు నామినేట్ అయినట్లుగా బిగ్బాస్ ప్రకటించారు.మొదటగా గంగవ్వ బోట్ నుండి దిగిపోయింది.
ఆమె తాను ఎక్కువ సమయం కూర్చోలేను అంటూ క్లారిటీగా చెప్పి మొదటి బజర్కు దిగి పోయింది.
ఆ తర్వాత కాస్త సీరియస్ గా ఎలిమినేషన్ నామినేషన్స్ జరుగుతాయని భావించారు.
కాని అంతా కూడా ఎవరికి వారే ఎలిమినేట్ అయ్యేందుకు ముందుకు వచ్చారు.రెండవ వారంలో ఎలిమినేషన్కు నామినేట్ అయిన వారు గంగవ్వ, నోయల్, మోనాల్, సోహెల్, అమ్మ రాజశేఖర్, కరాటే కళ్యాణి, కుమార్ సాయి, దేత్తడి హారిక, అభిజిత్లు నామినేట్ అయ్యారు.
వీరు అంతా కూడా ప్రేక్షకులు మమ్ములను సేవ్ చేస్తారు అనే నమ్మకంతో తమకు తాముగా ఎలిమినేట్ అయ్యేందుకు సిద్దం అయ్యారు.అయితే వీరులో ఎవరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది అంటూ అప్పుడే చర్చ మొదలు అయ్యింది.
ఈ వారంలో బిగ్బాస్ నుండి వెళ్లి పోయేందుకు నామినేట్ అయిన వారిలో కరాటే కళ్యాణి పరిస్థితి అనుమానంగా ఉంది.ఆమెను ప్రేక్షకులు ఉండాలని మొదటి వారంలోనే అనుకోలేదు.కనుక ఆమెకు ఎలిమినేషన్ తప్పదు అన్నట్లుగా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఆమె తర్వాత కొత్తగా వచ్చిన కుమార్ సాయికి ఎంతగా ఓట్లు వస్తాయి అనేది చెప్పలేం.
కనుక వీరిద్దరిలో ఎవరో ఒకరు మాత్రం ఎలిమినేట్ అవుతారేమో అనిపిస్తుంది.