తెలుగుదేశం అధినేత, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు త్వరలోనే మరో పాదయాత్రకు సిద్దం అవుతున్నారు అని తెలిస్తుంది.అయితే దాదాపు 10ఏళ్ల పోరాటం తరువాత 2000 కిలోమీటర్లకు పైగా చేసిన పాదయాత్ర పుణ్యమా అంటూ బాబుకు అధికారం మళ్లీ దక్కింది.
మరి అధికారంలో ఉన్నప్పుడు పాదయాత్ర ఎంటబ్బా అనే కదా మీ డౌట్.విషయం ఏమిటంటే గతంలో దివంగత ఎంత వైఎస్ఆర్ చంద్రబాబు ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు.9ఏళ్ల సుధీర్గ పాలనకు చెక్ పెట్టేందుకు పాదయాత్ర చేసి వరాల జల్లు కురిపించి అనూహ్యంగా రెండు మార్లు అధికారాన్ని చేజికించుకున్నాడు.ఇక ఆతరువాత “వస్తున్నా మీకోసం” అంటూ ఒక సాహసోపేతమైన పాదయాత్రను చంద్రబాబు చేపట్టాడు.
అధికారాన్ని చేజిక్కించుకున్నాడు.ఇక అధికారం కోసం అన్న వదిలిన బాణంగా “వైఎస్ శర్మిల” సైతం పాదయాత్రను నిర్వహించారు.
ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు చంద్రబాబు పాదయాత్రకు ఒక స్పెషల్ రీజన్ ఉంది అదేంటి అని అంటే ఈ నెల 18 వ తేదీన ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకొని బాబు పాదయాత్ర చేస్తారట.దాదాపుగా 18 కిలోమీటర్ల దూరం నడవనున్నట్లు సమాచారం.
ఇక ఆ రోజు ఉదయం స్మార్ట్ వార్డు, స్మార్ట్ గ్రామం కార్యక్రమాన్ని ప్రారంభించి బాబు పాదయాత్ర చేపట్టనున్నారు అని, అయితే ఈ కార్యక్రమం ఎక్కడ నిర్వహిస్తారు.అనే అంశం గురించి ఇంకా తగిన సమాచారం లేదు.
తెలుగుదేశం వాళ్లు కూడా ఈ విషయంలో ఇంకా ఒక నిర్ణయానికి రాలేదట.మరి ఈ వయసులో ఒకే రోజు 18 కిలోమీటర్ల దూరం నడవడం అంటే అంత సులభమేమీ కాదు.
మరి దీనిని బాబు ఎలా పూర్తి చేస్తాడో చూడాలి.