న్యూజిలాండ్ మసీదులోకి ప్రవేశించి ఓ దుండగుడు విచక్షణా రహితంగా కాల్పులకి పాల్పడి దానిని యుట్యూబ్, పేస్ బుక్ లో లైవ్ స్ట్రీమింగ్ ఇచ్చిన ఘటన అందరికి తెలిసిందే.ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనలో ఇప్పటికే మృతులు 49కి చేరగా తాజాగా హైదరాబాద్ కి చెందిన మరో ముస్లిం వ్యక్తి హాస్పిటల్ లో చికిత్స పొందుతూ చనిపోయారు.
దీంతో మృతుల సంఖ్య 50కి చేరింది.
ఇప్పటికే ఈ ఘటనలో తెలంగాణకి చెందిన ఫర్హాజ్ హసన్, ఇమ్రాన్ ఖాన్ మరణించారు.
ఇక తాజాగా ఒజైర్ ఖదీర్ అనే వ్యక్తి చికిత్స పోదుతూ చనిపోయాడు.ఇదిలా ఉంటే ఈ మారంహోమానికి పాల్పడిన వ్యక్తి కేవలం ట్రెండ్ క్రియేట్ చేయడం కోసమే అలా కాల్పులకి పాల్పడినట్లు కోర్ట్ విచారణలో పేర్కొనడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.
అలాగే నిందితుడు కాల్పులకి పాల్పడబోతున్నట్లు తమకి 9 నిమషాల ముందే సమాచారం అందిన ప్రజలని కాపాదలేకపోయాం అని న్యూజిలాండ్ ప్రధాని చెప్పుకొచ్చారు.