తెలుగు బుల్లి తెరపై సరికొత్త రియాల్టీ షోలు మొదలు పెట్టిన యాంకర్ ఓంకార్. ఈయన తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ దర్శకుడిగా కూడా మెప్పిస్తున్న విషయం తెల్సిందే.
ప్రముఖులు పలువురు ఓంకార్ షోలను ఫాలో అయ్యారు అవుతూనే ఉన్నారు.డాన్స్ షోకు ఇతర రియాల్టీ షోలు విభిన్నంగా రూపొందించడంలో ఓంకార్ ప్రత్యేకమైన శైలిని కలిగి ఉన్నాడు.
అలాంటి ఓంకార్ ప్రస్తుతం ఇస్మార్ట్ జోడీ అనే కార్యక్రమంను మా టీవీతో కలిసి నిర్వహిస్తున్నాడు.
ఇస్మార్ట్ జోడీ షూటింగ్ కరోనా లాక్ డౌన్ కారణంగా షూటింగ్ నిర్వహించలేక పోతున్నారు.
కేవలం ఇస్మార్ట్ జోడీ మాత్రమే కాదు.పలు టీవీ షోలు లాక్డౌన్ కారణంగా షూటింగ్స్ జరుపుకోవడం లేదు.
దాంతో టీవీ ఛానెల్స్ అన్ని కూడా పాత షోలను, పాత ఎపిసోడ్స్ను ప్రసారం చేస్తున్నాయి.అయితే ఓంకార్ ఇస్మార్ట్ జోడీని మాత్రం సరికొత్తగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ప్రయత్నించాడు.
అందులో సక్సెస్ కూడా అయ్యాడు.
ఇస్మార్ట్ జోడీ షోలో జంటలకు ఛాలెంజ్లు, గేమ్స్ ఉంటాయి.అయితే ఇప్పుడు ఇంటికే పరిమితం అయిన జంటలతో కొత్త తరహాలో స్కిట్స్ను ఓంకార్ చేస్తున్నాడు.ఆన్లైన్లో వారితో గేమ్ ఆడివ్వడం వల్ల సరికొత్త ప్రయత్నంకు శ్రీకారం చుట్టాడు.
ఓంకార్ ఇప్పటి వరకు ఇస్మార్ట్ జోడీ ఎపిసోడ్స్ ఆగిపోకుండా రన్ చేస్తూనే వస్తున్నాడు.మొత్తానికి ఓంకార్ బుర్రే బుర్ర అనిపించుకున్నాడు.