ఇటీవల ఒక కొరియోగ్రాఫర్ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు వైరల్ అయ్యాయి.ఆ ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ ఆట డాన్స్ షో ద్వారా వచ్చిన విజేత ప్రైజ్ మనీని ఓంకార్ ఇవ్వకుండా తనే ఉంచేసుకున్నాడు అంటూ విమర్శలు వ్యక్తం చేశాడు.
రైల్వే కూలీ తనయుడు గెలిస్తే కనీసం అతడి కోసం ప్రైజ్ మనీని ఇవ్వలేదు అంటూ విమర్శలు వ్యక్తం చేశారు.ఓంకార్ గేమ్ షో లేదా రియాల్టీ షో ఇలా ఏ షో అయినా ఏమాత్రం జెన్యూన్ కాదంటూ విమర్శలు ఉన్నాయి.
రేటింగ్ కోసం గొడవలు మరియు విభేదాలు సృష్టించడం ఆయనకు అలవాటు.అలాగే ప్రైజ్ మనీని కూడా దొబ్బేయడం ఆయనకే చెల్లింది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
ఈ సమయంలోనే ఆయన డాన్స్ ప్లస్ కు సంబంధించిన ప్రైజ్ మనీని ప్రకటించాడు.
ఈ ఆది వారం నాడు డాన్స్ ప్లస్ ఫినాలే ఎపిసోడ్ ను స్టార్ మా లో ప్రసారం చేయబోతున్నాడు.
అందుకు సంబంధించిన చిత్రీకరణ పూర్తి అయ్యింది.ప్రోమో ను కూడా విడుదల చేశాడు.
ప్రోమో లో ఓంకార్ మాట్లాడుతూ 20 లక్షల రూపాయలను ప్రైజ్ మనీగా ఇవ్వబోతున్నట్లుగా ప్రకటించాడు.ఓంకార్ 20 లక్షల రూపాయలను ప్రైజ్ మనీ అంటూ ప్రకటించిన వెంటనే నిజంగా నే ఇస్తావా అంటూ కొందరు కామెంట్స్ చేశారు.
డాన్స్ ప్లస్ షో కు నిర్మాత ఓంకార్.కనుక అంత డబ్బు అతడు ఇస్తాడంటే నమ్మకం కలుగడం లేదు అంటూ విమర్శ లు వ్యక్తం అవుతున్నాయి.
చాలా మంది ఓంకార్ ఈసారి కూడా మోసం చేస్తాడేమో అంటున్నారు.ఇరవై లక్షలు ఇస్తాడంటే మాత్రం అస్సలు నమ్మడం లేదు అంటున్నారు.
ఆయన ఇలాంటి జిమ్మిక్కులు చాలా చేస్తాడు.ఇది మరో జిమ్మిక్కు అంటున్నారు.
కనీసం పది లక్షలు ఇచ్చినా కూడా చాలా గొప్ప విషయమే అంటున్నారు.