తమిళనాడు లో ఇంటి పునాది తవ్వకాల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి రాతి విగ్రహం బయటపడింది.తమిళనాడులోని అరియలూర్ సమీపంలో ఇంటి నిర్మాణం కోసం తవ్వకాలు జరుపుతుండగా ఓ విగ్రహం పడినట్టు గుర్తించారు.
కారయంకురుచి గ్రామానికి చెందిన శరవణన్ తన స్థలంలో ఇంటి నిర్మాణం కోసం తవ్వకాలు జరిపించాడు పునాది తవ్వకాల్లో రాతి విగ్రహం తగిలినట్టుగా గుర్తించడంతో జాగ్రత్తగా తవ్వకాలు జరిపారు.పూర్తి తవ్వకం అయ్యాక ఎనిమిది అడుగుల వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం బయటపడింది.
విగ్రహం బయటపడిన వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వగా జేసీబీని రప్పించి దాని సహాయంతో విగ్రహాన్ని జాగ్రత్తగా వెలికి తీశారు.
గ్రానస్తులు స్వామి వారి విగ్రహాన్ని నీటితో శుభ్రపరచి పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
స్వామి వారి పురాతన విగ్రహాన్ని అధికారులు తిరుచ్చిలోని పురావస్తు శాఖ కార్యాలయానికి తరలించారు.ముందు గ్రామస్తులు అందుకు నిరాకరించగా అధికారులు వారిని ఒప్పించి విగ్రహాన్ని తీసుకెళ్లేలా చేశారు.
ఇంటి పునాది తవ్వకాల్లో స్వామి వారు కనిపించడం ఆ ఇంటి యజమాని షాక్ కు గురయ్యాడు.గ్రామస్తులు ఆ విగ్రహాన్ని అక్కడే ఉంచి పూజలు నిర్వహించాలని అనుకున్నా అధికారులు అందుకు వీలు లేదని చెప్పి పురావస్తు శాఖ వారికి విగ్రహాన్ని అప్పగించారు.