మారుతున్న పరిస్థితులు, పద్దతులను చూస్తుంటే ఈ లోకం ఎటు పోతుంది అనే అనుమానాలు వ్యక్తం అవుతాయి.చిన్న వారు తప్పు చేస్తే పెద్ద వారు సర్ది చెప్పాల్సిన అవసరం ఉంది.
అదే పెద్ద వారు తప్పు చేస్తే ఏం చేయాలి.ఆమె చేసింది తప్పా ఒప్పా అనే విషయం పక్కకు పెడితే 55 ఏళ్ల వయసులో ఆమె చేసిన పనిని సభ్యసమాజం ఖచ్చితంగా అంగీకరించదు.
కాని ఆమె మాత్రం నలుగురితో నాకేంటి అనుకుని తాను అనుకున్నట్లుగా చేసింది.ఆమె చేసిన పని స్థానికంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా వైరల్ అయ్యింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే… ఈజిప్ట్కు చెందిన సాండ్రా న్యూటన్ అనే 55 ఏళ్ల వృద్దురాలు దాదాపు 20 ఏళ్ల నుండి ఒక వ్యక్తితో సహజీవనం సాగిస్తుంది.భర్త నుండి విడిపోయిన ఆమె మరో వ్యక్తితో 20 ఏళ్ల నుండి కలిసి ఉంటుంది.
ఇద్దరు కూడా భార్య భర్తల మాదిరిగా కలిసి పోయి జీవితంను గడుపుతూ ఉన్నారు.అలాంటి వారు సరదాగా హనీమూన్కు వెళ్లాలనుకు న్నారు.పీటేతో న్యూటన్ 20 ఏళ్ల సహజీవనం చేసి చాలా సంతోషకర జీవితంను గడిపింది.ఆ జీవితం చాలు అనుకుందో లేదా మరేంటో కాని పీటేకు న్యూటన్ గుడ్ చెప్పేసింది.
హనీమూన్కు వెళ్లిన చోటే న్యూటన్కు షార్మ్ పరిచయం అయ్యింది.ఆ పరిచయంతో బామ్మకు షార్మ్పై మనసు పడింది.ఆమె అందం మరియు మాట తీరు బామ్మకు బాగా నచ్చింది.హనీమూన్కు వెళ్లిన అన్ని రోజుల కూడా ముగ్గురు ఒకే రూంలో ఉన్నారు.
పీటే ఇబ్బంది పడ్డా కూడా షార్మ్ ఉండాల్సిందే అంటూ బామ్మ న్యూటన్ తేల్చి చెప్పింది.దాంతో చేసేది ఏమీ లేక ముగ్గురు హోటల్లో ఉండే వారు.
హనీమూన్ నుండి తిరిగి వచ్చే సమయంలో పీటేను వదిలేసి షార్మ్తో కలిసి వచ్చేసింది.లెస్బియన్గా మారిపోయినట్లుగా ప్రకటించుకుని తాను షార్మ్తో సహజీవనం మొదలు పెడుతున్నట్లుగా ప్రకటించింది.ఈ బామ్మ చేసిన పనికి ఆమె సన్నిహితులు మరియు బంధువులు అంతా కూడా అవాక్కవుతున్నారు.55 ఏళ్ల వయసులో ఈబామ్మ ఇప్పుడు లెస్బియన్గా మారడం ఏంటీ, ఒక మహిళను తోడు తెచ్చుకోవడం ఏంటీ అనుకుంటున్నారు.న్యూటన్ మాత్రం ఎవరి మాటలు పట్టించుకోకుండా తాను అనుకున్నట్లుగా జీవించేస్తోంది.