ఈ ఘటన గురించి పూర్తిగా తెలుసుకుంటే అనిపిస్తుంది.ఈలోకంలో ఇంత అమాయకులు ఉన్నారా అని ఆశ్చర్యం వేస్తుంది.
కానీ ఎంతోమంది అమాయకులు ఉన్నారు మనకు తెలియదు అంతే.అసలు ఏమైంది? అంత అమాయకంగా ఎవరు ఉన్నారు ఇప్పుడు అని అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్న.
చెన్నైలోని నాగపట్టణం జిల్లా శీర్గాళి సమీపం పట్టియమేడుకు చెందిన ఉష అనే 52 ఏళ్ళ దివ్యాంగురాలు తన కూతురు పెళ్లి కోసం ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బును అంత ఇంటి వెనుక ప్రాంతంలో గుంత తవ్వి అందులో రూ.500, రూ.1,000 నోట్లను ఉంచింది.ఈ విషయాన్నీ ఎవరికి చెప్పలేదు.
ఇంకా ఇటీవల ఆమె భర్త రాజా దురై ఇంటి రిపేర్ చేపట్టగా ఆ డబ్బుల బ్యాగు బయటపడింది.ఇంకా అది తెరిచి చూడగా అందులో రూ.1,000 నోట్లు పది, రూ.500 నోట్లు 51 ఉన్నాయి.దీంతో రాజాదురై బాధ పడుతూ.నాలుగేళ్ల క్రితమే ఈ నోట్లు చెల్లవని ప్రభుత్వం ప్రకటించిందని భార్యతో తెలిపాడు.
అయితే ఈ విషయం ఆమెకు ఎవరూ చెప్పలేదు అని ఆమె అమాయకంగా బదులిచ్చింది.దీంతో ఆ దివ్యాంగురాలికి సాయం చేసేలా ప్రభుత్వం ముందుకు రావాలని ఆ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
మరి ప్రభుత్వం ఇందుకు ఒప్పుకుంటుందా? లేదా అనేది చూడాలి.