లేటు వయసులో ప్రేమలు మరియు పెళ్లిలు అంటూ మీడియాలో మనం తరుచు చూస్తూనే ఉటాం.అయితే అవి ఎక్కువగా ఇతర దేశాలకు సంబంధించిన వార్తలు అయ్యి ఉంటాయి.
మన దేశంకు చెందిన వార్తలు చాలా అరుదుగా ఉంటాయి.అయితే ఈసారి మన దేశంకు చెందిన ఒక ముసలి ప్రేమ గురించి ఇప్పుడు మీ ముందుకు తీసుకు వచ్చాను.
వారిద్దరు కూడా ఎనిమిది పదుల వయసు క్రాస్ చేశారు.ఆరోగ్యంగానే ఉన్నా ఏ సమయంలో ఎలాంటి బ్యాడ్ న్యూస్ వినాల్సి వస్తుందో చెప్పలేని పరిస్థితి.
అలాంటి వయసులో వారిద్దరు పెళ్లి చేసుకున్నారు.అది కూడా గ్రాండ్గా కుటుంబ సభ్యుల సమక్షంలో అవ్వడంతో అది కాస్త వైరల్ అయ్యింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే… కేరళకు చెందిన లక్ష్మి అమ్మాల్ భర్త 21 ఏళ్ల క్రితం చనిపోయాడు.ఆమె ఒంటరి జీవితాన్ని సాగిస్తున్నారు.ఆమె పిల్లలు అంతా దూర ప్రాంతాల్లో సెటిల్ అవ్వడంతో ఆమెను వృద్దాశ్రమంలో వదిలేశారు.అదే వృద్దాశ్రమంలో లక్ష్మీ అమ్మాల్కు గతంలో తన భర్త వద్ద అసిస్టెంట్గా పని చేసిన మేనన్ కనిపించాడు.
అతడితో గతంలోనే పరిచయం ఉండటంతో పాటు అతడి భార్య కూడా చనిపోయి ఒంటరి జీవితాన్ని సాగిస్తున్నాడు.ఇద్దరు కూడా కొద్ది రోజుల్లోనే ఒక్కటయ్యారు.వారిద్దరి మాటలు ప్రేమకు దారి తీశాయి.
చావు ముందు ఉంచుకుని పెళ్లి చేసుకోవడం అవసరమా అనుకున్నారు.కాని వారి ఆలోచన వారి మద్య ప్రేమ విషయం తెలిసిన కుటుంబ సభ్యులు వారికి పెళ్లి చేయాలని భావించారు.రెండు ఫ్యామిలీలు కూడా గతంలో ఉన్న పరిచయం కారణంగా వెంటనే కలిసి పోయి పెళ్లికి సిద్దం అయ్యాయి.
ఇటీవలే కేరళలోని ఒక ప్రముఖ ఆలయంలో వివాహం అయ్యింది.వీరి పెళ్ళికి కేరళ మంత్రి కూడా వచ్చాడు.
వివాహం అయిన తర్వాత మళ్లీ వీరిద్దరు వృద్దాశ్రమంలోకే వెళ్లారు.బతికి ఉన్నంత కాలం ఒకరికోసం ఒకరు అన్నట్లుగా జీవిస్తామంటున్నారు.ప్రస్తుతం లక్ష్మీ అమ్మాల్ మరియు మేనన్ల పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.వీరి ప్రేమ వివాహం చూసిన తర్వాత అయినా ప్రేమకు వయసు అడ్డు కాదు అనే విషయాన్ని ఒప్పుకుంటారా?
.