కరోనా వైరస్ వచ్చిందని గుర్తించాలంటే జలుబు, దగ్గు, ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా ఉండటం, వాసన గుర్తించలేక పోవడం, నాలుక రుచిని కోల్పోవడం వంటివి జరుగుతున్నాయి.ఇవి అధికంగా అవుతున్నా కొద్ది కరోనా ప్రభావం మనిషిపై ఎక్కువ అవుతున్నట్లుగా గుర్తించాలంటూ వైధ్యులు ఇన్ని రోజులు చెబుతున్నారు.
పై లక్షణాల్లో ఏ ఒక్క లక్షణం ఉన్నా కూడా అత్యంత జారగత్తగా ఉండటంతో పాటు వెంటనే క్వారెంటైన్కు లేదా ఐసోలేషన్కు వెళ్లాల్సిందే.కాని ఇప్పుడు కేరళలో జరిగిన సంఘటన ఆందోళన కలిగిస్తుంది.
తాజాగా దుబాయి నుండి వచ్చిన ఒక వృద్దుడు ఇంకా దిల్లీ నుండి వచ్చిన ఒక యువతిని కేరళ వైధ్య అధికారులు పరీక్షించారు.వారిద్దరు కూడా పూర్తి ఆరోగ్యంగా కనిపిస్తున్నారు.
పైకి మాత్రం కనీసం దగ్గు, జలుబు కూడా కనిపించడం లేదు.క్వారెంటైన్లో ఉన్న వీరిని వదిలేయాలనే ఉద్దేవ్యంతో పరీక్షలు నిర్వహించగా వారికి కరోనా పాజిటివ్ అని వెళ్లడయ్యింది.
దాంతో అవాక్కయిన అధికారులు వారిని ఐసోలేషన్కు పంపించారు.లక్షణాలు లేకుండానే కరోనా పాజిటివ్ అంటూ కొందరికి వస్తున్న నేపథ్యంలో వారు తెలియకుండా ఎంత మందికి కరోనాను అంటిస్తారో అనే ఆందోళన వ్యక్తం అవుతుంది.