నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షో సీజన్2 చివరి ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో తాజాగా రిలీజైంది.అన్ స్టాపబుల్ షో బాలయ్య పవన్ కాంబో ఫస్ట్ ఎపిసోడ్ కు మంచి రెస్పాన్స్ రాగా సెకండ్ ఎపిసోడ్ ఫిబ్రవరి 10వ తేదీన స్ట్రీమింగ్ కానుంది.
ఈ ఎపిసోడ్ కు కూడా అంచనాలకు మించి రెస్పాన్స్ రావడం గ్యారంటీ అని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
తాజాగా రిలీజైన ప్రోమోలో బాలయ్య పవన్ ను జేబులో చేతులు ఎందుకు పెట్టుకున్నావని అంటే నాకు ఏమనిపిస్తుందంటే ఎవరినీ కొట్టకుండా ఆపడానికి ఈ విధంగా చేతులు పెట్టుకుంటున్నావేమో అని నాకు అనిపిస్తోందని బాలయ్య అభిప్రాయం వ్యక్తం చేశారు.
కారుపైన ఎక్కి దిగిన్ ఫోటో గురించి పవన్ స్పందిస్తూ కారులో వెళ్లకూడదని కారునుంచి బయటకు రాకూడదని రూమ్ లో ఉండకూడదని అలా ఆంక్షలు పెడితే తిక్క వచ్చిందని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.
జనసేన పార్టీ స్థాపనకు గురించి పవన్ మాట్లాడుతూ ఎంతసేపూ మనం ప్రాథమిక హక్కుల గురించి మాట్లాడతాం తప్ప బాధ్యతల గురించి మాట్లాడమని అన్నారు.ఎదిగే వాళ్లను ఎదగకుండా చేయడం వ్యూహమని ఆయన తెలిపారు.ఒక ముసలావిడ ఈ షోకు హాజరై నా ఇద్దరు కొడుకులు కరోనా వచ్చి చనిపోయారని ఇంకొక కొడుకు ఉన్నాడని ఆ కొడుకు ఈ కొడుకు మాత్రమే తనకు మిగిలారని ఆమె కామెంట్లు చేశారు.
పవన్ కళ్యాణ్ సీఎం అయిన తర్వాత అప్పుడు చచ్చిపోతానని ఆ ముసలావిడ పేర్కొన్నారు.క్రిష్ కూడా ఈ షోకు హాజరు కాగా మా ఇద్దరితో పని చేశావు కదా డిఫరెన్స్ ఏంటి అని అడిగారు.ఆ ప్రశ్నకు క్రిష్ సింహం, పులి మధ్యలో నా తల ఉందని తెలిపారు.ఈ వీడియోకు ఇప్పటివరకు ఏకంగా 15 లక్షల వ్యూస్ వచ్చాయి.