కరోనా వైరస్ వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి.ముఖ్యంగా వృద్ధులకు ఎక్కువగా శరీర అవయవాలపై ప్రభావం పడే అవకాశాలున్నాయని వైద్యులు తెలిపారు.
అంతేకాకుండా చిన్న వయసు వారికి కూడా గుండెకు సంబంధించిన సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు.కాగా ఇటీవలే చేసిన పరిశోధనల్లో వృద్ధులకు ఎక్కువగా గుండె సమస్యలు కరోన వల్లే వస్తుందని నిర్ధారించారు.
అమెరికా యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్ కు చెందిన శాస్త్రవేత్తలు.వాళ్లు చేసిన పరిశోధనల్లో 80 ఏళ్ళు పై గా ఉన్న వృద్ధులకు గుండె పోటు రావడం సహజమేనని తెలిపారు.
అంతేకాకుండా ఇటీవలే బీఎంజే జర్నల్ లో ఈ విషయంపై ప్రచారం కాగా అమెరికాలో 68 ఆసుపత్రిలో అస్వస్థకు గురైన వృద్ధులను దాదాపు 5,019 మందిని పరీక్షించడానికి చేర్చుకున్నారు.
అందులో ఎక్కువగా 80 ఏళ్లు పైబడిన వాళ్లే ఉన్నారు.వీళ్ళందరికీ ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.అయితే ఈ చికిత్స పొందిన వాళ్ళల్లో 701 మంది ఆసుపత్రిలో చేరిన 14 రోజుల్లోనే గుండెపోటుకు గురవుతున్నారని వైద్య నిపుణులు తెలిపారు. ఇదిలా ఉంటే ఇందులో
400 మందికి సీపీఆర్
ను అందించడం వల్ల ప్రాణాలు దక్కుతున్నాయని వైద్యులు తెలిపారు.అంతేకాకుండా గుండెకు సంబంధించిన సమస్యలు దాటుకొని ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యేవాళ్ళు కేవలం సీపీఆర్ అందించడం వల్లనే ప్రాణాల నుండి కాపాడుకుంటూ బయట పడుతున్నారని తేలింది.
ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్న 80 ఏళ్ళు పైబడిన వాళ్లకి ఎక్కువ ప్రాణాపాయ స్థితి ఉందని తెలిపారు.ఇదిలా ఉంటే వైద్య నిపుణులు చేసిన పరిశోధనలో మరో విషయం బయట పడగా.
కొన్ని సమయాలలో వృద్ధులకు గుండె సమస్య నుంచి సీపీఆర్ ను అందించిన కూడా గుండె పనితీరు ఒకేసారి ఆగిపోతున్నాయి అనే విషయాన్ని వైద్యులు తెలిపారు.