బలమైన సంకల్పం ఉండాలి కానీ … అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేసి చూపించవచ్చు అనే మాటలను నిజం చేసి చూపించింది కేరళలోని ఓ లేటు వయస్సు మూసలమ్మ.సెంచరీ కొట్టేందుకు చేరువలో ఉన్న ఈ బామ్మ.
ఎగ్జామ్లో మాత్రం సెంట్ పర్సెంట్ స్కోర్ చేసి టాపర్గా నిలిచింది.దాంతో ఈ బామ్మ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ చేతుల మీదగా రేపు (గురువారం) మెరిట్ సర్టిఫికెట్ అందుకోనుంది.
వివరాలు.కేరళ అలప్పుజ జిల్లా ముత్తం గ్రామానికి చెందిన కార్థియాని అమ్మ(96)… ఆలయాల్లో శుభ్రం చేస్తూ జీవనం గడిపేది.
బాల్యంలో బడి ముఖం చూడని ఈ బామ్మ చదువుపై మక్కువతో కేరళ ప్రభుత్వ ప్రారంభించిన ‘అక్షర లక్ష్యం’ కార్యక్రమంలో చేరింది.
రాష్ట్రంలో 100శాతం అక్షరాస్యత సాధించేందుకుగాను కేరళ ప్రభుత్వం ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా సాక్షరతా మిషన్లో భాగంగా ఈ ‘అక్షర లక్ష్యం’ కార్యక్రమాన్ని ప్రారంభించింది.ఈ కార్యక్రమంలో భాగంగా అధికారులు నాలుగు, ఏడు, పది, ఇంటర్ తరగతులకు సంబంధించి దాదాపు 42, 933మంది పరీక్షలు నిర్వహించారు.కార్థియాని అమ్మ నాలుగో తరగతి పరీక్షలకు హాజరయ్యింది.
అంతేకాక ఈ పరీక్షలో ఆమె 98 మార్కులు సాధించి టాపర్గా నిలించింది.ఈ విషయం గురించి బామ్మ మాట్లాడుతూ.
‘నేను ఇప్పుడు చదవగలను, రాయగలను లెక్కలు కూడా చేయగలను.అంటూ కేరింతలు కొడుతోంది ఈ బామ్మ !