బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్న నటుడు ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.ఈ క్రమంలోనే ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ రామాయణం నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ఆది పురుష్.
ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో సందడి చేయనున్నారు.ఇక ఇందులో ప్రభాస్ సరసన సీతమ్మ పాత్రలో కృతి సనన్ నటిస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పనులను శరవేగంగా జరుపుకుంటుంది.
ఇకపోతే ఈ సినిమాని ఆగస్టు 11వ తేదీ విడుదల చేయనున్నట్లు గతంలో మేకర్స్ వెల్లడించారు.
ఇలా ఈ సినిమా తేదీని దృష్టిలో పెట్టుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా శరవేగంగా కొనసాగించినట్లు తెలుస్తోంది.అయితే ఈ సినిమాని ఆగస్టు 11వ తేదీ విడుదల చేస్తున్నారని తెలియడంతో అదే రోజున అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చడ్డా సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించడంతో అమీర్ ఖాన్ అండ్ చిత్ర బృందం ఆది పురుష్ మేకర్స్ తో సంప్రదింపులు జరిపి ఈ సినిమాని వాయిదా వేసుకోవాలని రిక్వెస్ట్ చేశారట.
ఈ క్రమంలోనే ఆది పురుష్ మేకర్స్ సైతం ఈ సినిమాని ఆగస్టు 11వ తేదీ విడుదల చేయడానికి పోస్ట్ పోన్ చేశారు.ఇలా ప్రభాస్ తన సినిమా విడుదల తేదీని త్యాగం చేసినప్పటికీ ఆమీర్ ఖాన్ సినిమా మాత్రం ఎలాంటి విజయాన్ని అందుకోకపోవడంతో ఆయన త్యాగం వృధాగా మారిపోయిందని పలువురు భావిస్తున్నారు.అయితే ఆది పురుష్ సినిమా పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో ఈ సినిమా విడుదల మరి కాస్త ఆలస్యం అవుతుందని తెలుస్తోంది ఇక ఈ సినిమాని ఏకంగా 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు.మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో తెలియాల్సి ఉంది.