రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఎక్కువగా సైన్యంలో పురుషులే ఉండేవారు.ఇక యుద్ధం నిరంతరంగా సంవత్సరాలు పాటు జరగడం వలన యుద్ధంలో పాల్గొనే సైనికులకి అసలు విశ్రాంతి ఉండేది కాదు.
ఇదే సమయంలో సైనికులు ఎక్కువగా పురుషులు కావడం వలన రోజుల తరబడి ఒంటరితరం, ఆపై యుద్ధం ఒత్తిడి ఎక్కువగా ఉండేది.ఆ ఒత్తిడి నుంచి తగ్గించడానికి జపాన్ దేశం ఓదార్పు మహిళల విధానం అమల్లోకి వచ్చింది.
దీనిని ప్రభుత్వమే ప్రోత్సహించింది అని క్యూడో న్యూస్ సర్వీస్ సంచలన వాస్తవాలు తాజాగా బయటపెట్టింది.జపాన్ కేబినెట్ సెక్రటేరియట్ పత్రాలను సేకరించిన న్యూస్ ఏజెన్సీ 13 రహస్య పత్రాలని గుర్తించింది.
ఆ పత్రాలు 1938లో కొన్ని చైనాలోని జపనీస్ కాన్సులేట్ నుంచి టోక్యోలోని ఫారిన్ మంత్రికి ఇచ్చినవి కూడా ఉన్నాయి.ఈ పత్రాలలో సమాచారం ప్రకారం ఓదార్పు మహిళలను సమకూర్చాలని జపాన్ సైన్యం టోక్యో ప్రభుత్వాన్ని కోరింది.
ప్రతి 70 మంది సైనికులకు ఒక శృంగార బానిసగా మహిళలు అవసరమని తెలిపింది.సైనికుల్లో అత్యాచారాలను నిరోధించేందుకు యుద్ధ సమయంలో వీళ్ళ అవసరం ఎంతైనా ఉందని అందులో పేర్కొంది.
జపనీస్ సైనికుల కోసం ఆ ఏడాది ఏప్రిల్ చివరినాటికి తక్కువలో తక్కువ 500 మంది ఓదార్పు మహిళలను తప్పనిసరిగా పంపించాలి ఆ పాత్అరాలలో ఉన్నినట్లు క్యోడో న్యూస్ సర్వీస్ పేర్కొంది.ఆ సమయంలో కొందరు మహిళలు ఇష్టపడి ఈ వృత్తిలో చేరగా కొంత మందిని బలవంతంగా ఒప్పించి పంపించినట్లు సమాచారం.
వారింది రెండో ప్రపంచ యుద్ధ సమయంలో సైనికుల శృంగార అవసరాలు తీర్చే బానిసలుగా వాడారని క్యూడో న్యూస్ పేర్కొంది.మొత్తానిలి ఈ ఏజెన్సీ రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్ చేసిన పనిని ఇప్పుడు ప్రపంచానికి పరిచయం చేసింది.
దీంతో ఈ న్యూస్ కాస్తా వైరల్ అయ్యింది.