పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పాటు వచ్చే ఎన్నికల నోటిఫికేషన్ నాటికి పూర్తి చేసి తమ ఖ్యాతిని చాటుకోవడంతో పాటు… అదే అంశంతో ఎన్నికల ప్రచారంలోకి వెళ్లాలని చూస్తోంది.అయితే ముందు నుంచి ఈ ప్రాజెక్ట్ పై ఏదో ఒక అడ్డు పుల్ల వేస్తూ వస్తున్న ఒడిస్సా ప్రభుత్వం తాజాగా… సుప్రీం కోర్టు లో పిటిషన్ వేసింది.
ఈ ప్రాజెక్టు వల్ల ఒడిశాకు తీరని నష్టం జరుగుతుందని, కాబట్టి వెంటనే పనులు ఆపాలని ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ నవీన్ పట్నాయక్ ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది.తమ వ్యాజ్యాన్ని త్వరగా విచారించాలని అభ్యర్థించింది.దీంతో స్పందించిన సుప్రీంకోర్టు ఈ నెల 27న దీనిపై విచారణ చేపడతామని వెల్లడించింది.