దేశంలో కరోనా వల్ల నెలకొన్న పరిస్దితులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పై ప్రజల్లో అసంతృప్తి నెలకొంటున్నదని ప్రచారం జరుగుతుండగా, ఈ విషయంలో నిన్న జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, ప్రధాని నరేంద్రమోదీపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ చేసిన ట్వీట్కు ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి స్పందించిన సంగతి తెలిసిందే.కాగా ప్రధాని తన మాటలు వినలేదని, ఆయన చెప్పాలనుకున్నదే చెప్పారని, దానికి బదులుగా ప్రజలకు పనికొచ్చే మాటలు చెప్పితే బాగుండేదంటూ జార్ఖండ్ ముఖ్యమంత్రి ఆ ట్వీట్లో పేర్కొన్నారు.
అయితే జగన్ స్పందిస్తూ ఈ సమయంలో ఇలాంటి మాటలు మాట్లాడకుండా మహమ్మారి పై జరుగుతున్న యుద్ధం లో ప్రధానికి అండగా నిలబడదామని హితవు పలికారు.ఈ నేపధ్యంలో జగన్ ట్వీట్పై స్పందించిన ఒడిశా కాంగ్రెస్ ఎంపీ సప్తగిరి ఉలాకా రీట్వీట్ చేస్తూ.
దేశం ప్రస్తుతం ఎలాంటి పరిస్దితుల్లో ఉందో అందరికి తెలిసిందే.
ఇలాంటి క్లిష్టసమయంలో సరైన మార్గదర్శకాలతో ప్రజలను ఆదుకోవలసింది పోయి చోద్యం చూస్తున్న కేంద్ర విధానాలను సమర్దిస్తూ రాజకీయ ప్రయోజనాల కోసం లాలూచీ పడడం సరికాదని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
అసలు మీ భయం ఏంటో ప్రజలందరికి తెలుసని, ఒక రాష్ట్రానికి సీయం అన్న విషయాన్ని మరచిపోయి సీబీఐ, ఈడీ దాడులకు భయపడి ప్రధానికి దాసోహం కావడమేంటని ప్రశ్నించారు.మరి ట్వీట్ కు జగన్ ఎలా స్పందిస్తారో చూడాలి.