బిర్యానీ అంటే మనందరికీ ఎంతో ఇష్టం.మరీ ముఖ్యంగా హైదరాబాదీ దమ్ బిర్యానీ అంటే మహా ఇష్టం.
ఇక భోజన ప్రియుల గురించి అయితే చెప్పాల్సిన పనిలేదు.అలంటి బిర్యానీ ని ఇద్దరు ఇంజనీర్లు తయారు చేస్తూ తమ బిజినెస్ ను స్టార్ట్ చేసారు.
ఒక వైపు సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు చేస్తూనే మరొక వైపు బిర్యానీ చేస్తూ బిజినెస్ కూడా చేస్తూ నెలకు లక్షల డబ్బును సంపాదిస్తూ సోషల్ మీడియాలో వార్తల్లోకెక్కారు.
వీరిద్దరూ చేస్తున్న దమ్ బిర్యానీ బిజినెస్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
టేస్టీ బిర్యానీ, చికెన్ టిక్కా వంటి స్పెషాలిటీతో మంచి సంపాదన ఆర్జిస్తున్నారు.వీరిద్దరి పేర్లు సుమిత్ సమల్, ప్రియం బెబర్త.వీరిద్దరూ ఇంజినీర్లు.ఒడిశా కు చెందిన వీరు ఒక ఫుడ్ కార్ట్ ను నడుపుతున్నారు.
రుచికరమైన వంటలతో వీరు బాగా ఫేమస్ అయ్యారు.
ఒక్కసారి వచ్చిన కస్టమర్ మళ్ళీ మళ్ళీ వచ్చి తినే అంత ఫేమస్ అయ్యింది వీరి ఫుడ్ కోర్ట్.
మొదట 50 వేల పెట్టుబడితో స్టార్ట్ చేసారు.ఇప్పుడు నెలకు అన్ని ఖర్చులు పోగా 2 లక్షల వరకు సంపాదిస్తున్నారట.అలా అని వారు ఉద్యోగాలు మానేసి ఈ ఫుడ్ కోర్ట్ నడపడం లేదు.అటు ఉద్యోగాలు చేస్తూనే ఇటు బిజినెస్ చేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు.
వీరిద్దరూ చిన్ననాటి మిత్రులు.అలా ఒక రోజు బయటకు వెళ్లి బిర్యానీ తినగా అక్కడ క్వాలిటీ లేకపోవడంతో దాని గురించి మాట్లాడుతూ వారికీ ఒక ఆలోచన వచ్చింది.వెంటనే దానిని అమలు చేసారు.అందుకే మంచి క్వాలిటీతో పాటు క్వాండిటీ కూడా మైంటైన్ చేస్తూ వీరు మంచి రుచికరమైన బిర్యానీ ని ప్రజలకు అందిస్తున్నారు.వీరిద్దరిని చూసి నేటి యువత చాలా నేర్చుకోవాలి.మనం అనుకుంటే ఏదైనా సాధించగలం అనేది ముందు నేర్చుకోవాలి.
కష్టపడితే ఏదైనా సాధించవచ్చు అనే దానికి వీరు ఉదాహరణగా నిలుస్తున్నారు.