ఒడియాకి చెందిన ఓ హీరోయిన్ తో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ యువకుడు ఫేస్ బుక్ లో ప్రేమలో పడి ఆ తర్వాత ఆమె తనను మోసం చేసిందంటూ ఆ యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే విశాఖపట్నం ప్రాంతానికి చెందిన పద్మరాజు రవి కుమార్ అనే యువకుడు చిన్మయ ప్రియదర్శిని అనే హీరోయి న్ ను సోషల్ మీడియా మాధ్యమం అయిన ఫేస్ బుక్ లో చూసి ప్రేమించాడు.
అయితే ఈ క్రమంలో వారు తరచూ కలుసుకునేవారు.ఈ క్రమంలో నటి చిన్మయకి ఓ ల్యాప్ టాప్, రెండు లక్షల రూపాయలు నగదు అలాగే బంగారం గొలుసు వంటివి ఇచ్చాడు.
అయితే ఈ క్రమంలో పెళ్లి చేసుకుందామని అడిగాడు.దాంతో ఆమె నిరాకరించడంతో నటి చిన్మయ తనను ప్రేమించినట్లు చెప్పితనని మోసం చేసిందని పోలీసులుకు ఫిర్యాదు చేశాడు.
ఈ ఫిర్యాదులో భాగంగా తన నుంచి డబ్బులు బంగారం ల్యాప్టాప్ తీసుకుని మోసం చేసిందని అంతేగాక ఇప్పుడు పెళ్లి చేసుకునేందుకు కూడా నిరాకరిస్తోందని తెలిపాడు.దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
అయితే ఈ విషయంపై నటి చిన్మయ స్పందిస్తూ రవికుమార్ తనపై చేసిన ఆరోపణలన్ని అసత్యాలని, అంతేగాక రవికుమార్ తన అభిమాని గా ఫేస్ బుక్ లో పరిచయం అయ్యాడని అన్నారు.అలాగే భవనేశ్వర్ లో తను ఒకసారి కలిసాడని ఆ సమయంలో తనకు డబ్బులు ఇబ్బంది గా ఉందని చెప్పి తన నుంచి లక్షన్నర రూపాయలు తీసుకొని 50 వేల రూపాయలు మాత్రమే తిరిగి ఇచ్చాడని పేర్కొన్నారు.అలాగే తనని పెళ్లి చేసుకోవాలని రవికుమార్ ప్రపోజ్ చేశాడని అందుకు తానునిరాకరించినందువల్లనే ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తూ సమాజంలోతనకు ఉన్నటువంటి గౌరవ మర్యాదలను భంగం కలిగించేందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నాడని అన్నారు. అలాగే అతడి పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ పోలీసులను నటి చిన్మయ కోరారు.