ప్రపంచ వ్యాప్తంగా శరవేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్ తన మన భేదాలు లేకుండా అందరిని ఈక్వల్ గా చూస్తోంది.రాజకీయ నాయకుల నుంచి సెలబ్రిటీల వరకు.
బీద ప్రజల నుంచి ధనవంతుల వరకు అందరిని అంటిపెట్టుకుంటోంది.కరోనా ఎవరికైనా సోకొచ్చు.
మిగితా వారితో పోలిస్తే ఊబకాయం ఎక్కువగా ఉన్న వ్యక్తులకు కరోనా సోకే ప్రమాదం అధికంగా ఉంటుందని పరిశోధకులు చెప్తున్నారు.
శరీరంలో ఆకలిని నియంత్రించేది హార్మోన్ లెప్టిన్.
ఈ హార్మోన్ మనిషి శరీరంలో ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలో కొవ్వు శాతం అధికంగా పెరుగుతుంది.దీంతో వీరిలో రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
ఊబకాయం ఉన్న వారిలో ఆరోగ్య సమస్యలు అధికంగా వస్తుంటాయని, ఎక్కువగా ఊపరితిత్తుల సమస్య అధికంగా ఉంటుందని అన్నారు.వీరికి కరోనా సోకినట్లయితే ఊపిరి తీసుకోవడం కష్టంగా మారుతుందన్నారు.
లెప్టిన్ హార్మోన్ అధికంగా ఉత్పత్తి అవ్వడం వల్ల వీరికి కరోనా సోకే ప్రమాదం ఎక్కువ కాబట్టి ఊబకాయులు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలన్నారు.అధిక బరువుకు తగ్గించేందుకు రోజు వ్యాయామం, యోగా చేస్తుండాలని అని అన్నారు.
రోజు వేడి నీళ్లు తీసుకోవడం వల్ల ఆరోగ్యంతో పాటు కొవ్వు, మలినాలు శరీరం నుంచి తొలగిపోతాయని అన్నారు.