అమెరికాలో ఉన్న భారత ఎన్నారైలలో సిక్కులు, ఆ తరువాత తెలుగువారు ఎక్కువగా ఉంటుంటారు.అంతేకాదు సిక్కులు అత్యధికంగా అమెరికాలోని వివిధ రాష్ట్రాలలో కీలక పదవులలో కొనసాగుతున్నారు కూడా.
అయితే అమెరికాలో 1969లో జరిగిన అల్లర్ల తరువాత అందరికి సమాన హక్కులు ఉండాలని ప్రతీ ఏడాది జూన్ లో లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్జెండర్ ఇలా కమ్యునిటీలని గౌరవిస్తూ ఫ్రైడ్ మంత్ అనే కార్యక్రమం నివహిస్తూ ఉంటారు.
ఈ సంవత్సరం ఎంతో అట్టహాసంగా జరిగిన ఈ ప్రైడ్ మన్త్లో బై సెక్సువల్ అయిన జివాందీప్ కొహ్లీ అనే సిక్కు వ్యక్తి, అమెరికా మాజీ అధ్యక్షుడి మనసు గెలుచుకున్నాడు.ఎందుకంటే సిక్కులు తలపాగా ఎంతో ఆకర్షణీయంగా ఉంటుందనే విషయం అందరికి అయితే జివాందీప్ ఎల్జీబీటీ కమ్యూనిటీకి గుర్తుగా రైన్ బో రంగులతో ఉన్న తలపాగాని ధరించి అందరిని ఆకర్షించాడు.అంతేకాదు ట్విట్టర్ లో తన ఫోటో కూడా పెట్టుకున్నాడు.
తానూ భారత దేశానికి చెందినా వాడినని న్యూరో సైంటిస్ట్ గా అమెరికాలో పని చేస్తున్నానని, శాండియాగో ప్రాంతంలో ఉంటున్నాని, తాను బైసెక్సువల్ అని చెప్పుకోవడానికి ఎంతో గర్వంగా భావిస్తున్నాని తలపాగాతో ఉన్న ఫోటో ని ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.ఈ ఫోటోని చూసిన ఒబామా తానూ రీ ట్వీట్ చేశారు.తలపాగా చాలా బాగుందని, అమెరికా అందరికి సమానమని చెప్పినందుకు సంతోషిస్తున్నాని కృతజ్ఞతలు తెలిపారు.
2 Attachments
.