ప్రభాస్ పాన్ ఇండియా స్థాయిలో అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో రామాయణం నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ఆది పురుష్.ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పనులను జరుపుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉన్నారు.
అయితే తాజాగా మేకర్స్ ఈ సినిమా నుంచి బిగ్ అప్డేట్ విడుదల చేశారు.ఈ సినిమాకి సంబంధించిన ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయడమే కాకుండా ఈ సినిమా టీజర్ కూడా విడుదల చేశారు.
అయోధ్యలో సరియునది తీరాన టీజర్ లాంచ్ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు.
ఇకపోతే ఈ సినిమా నుంచి టీజర్ విడుదలైన అతి తక్కువ సమయంలోనే ఈ టీజర్ వైరల్ అవ్వడమే కాకుండా పెద్ద ఎత్తున నేటిజన్ల నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి.
ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్ కన్నా కార్టూన్ ఛానల్ చాలా అద్భుతంగా క్లారిటీగా విజువల్స్ అందిస్తాయి అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు.ఈ క్రమంలోనే మరి కొంతమంది నేటిజన్స్ ఇంకాస్త బాగా వర్క్ చేసి ఉండొచ్చు కదా’ అంటూ ప్రముఖ వీఎఫ్ఎక్స్ సంస్థ ఎన్వై వీఎఫ్ఎక్స్వాలా సమస్థకు ట్యాగ్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఈ విషయంపై ఎన్వై వీఎఫ్ఎక్స్వాలా స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు.ఈ క్రమంలోనే వీఎఫ్ఎక్స్ రంగంలో అగ్రగామిగా కొనసాగుతోన్న ఎన్వై వీఎఫ్ఎక్స్వాలా సంస్థ ‘ఆదిపురుష్’ సినిమా కోసం పనిచేయలేదు.ఈ సినిమాకు సంబంధించి సీజీ లేదా ఏ ఇతర స్పెషల్ ఎఫెక్ట్స్ కు కూడా తాము పని చేయలేదని క్లారిటీ ఇచ్చారు.చాలామంది ఈ సినిమాకు స్పెషల్ ఎఫెక్ట్స్ మేమే పెట్టామని మాకు ట్యాగ్ చేస్తున్నారు అయితే ఈ సినిమా టీజర్ కు మాకు ఎలాంటి సంబంధం లేదని ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు.