ప్రస్తుతం ఐపీఎల్ 2021 సీజన్ కొనసాగుతున్న సంగతి అందరికీ తెలిసిందే.ఐపీఎల్ 2021 సీజన్ లో భాగంగా సన్ రైజర్ హైదరాబాద్ ఆటగాడు నటరాజన్ గాయపడిన సంగతి అందరికీ తెలిసిందే ఈ క్రమంలో మొదటగా అతడు బెంచ్ కు పరిమితం అయిన కానీ, చివరికి డాక్టర్లు మోకాలికి సర్జరీ చేయాలని తెల్చడంతో సర్జరీ చేయించుకున్నాడు నటరాజన్ ఈ క్రమంలో తన మోకాలి సర్జరీ విజయవంతంగా పూర్తి అయిందని సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో నట్టు భావాలను పంచుకున్నాడు.
క్రికెటర్ నటరాజన్ సోషల్ మీడియా వేదికగా నేడు నా మోకాలికి సర్జరీ విజయవంతంగా పూర్తయిందని, సర్జరీలో భాగంగా నిపుణుల మెడికల్ టీం, సర్జన్ లకు ధన్యవాదాలు తెలియజేశాడు.అలాగే నా సర్జరీ విజయవంతం కావాలని నాకు విషెస్ తెలిపిన బిసిసిఐకి, అభిమానులకు నా ప్రత్యేక ధన్యవాదాలు” అంటూ చెప్పుకొచ్చాడు.
సర్జరీ పూర్తి అయిన అనంతరం నటరాజన్ కు తగిన విశ్రాంతి అవసరమని డాక్టర్లు తెలియజేశారు.అయితే, ఈ క్రమంలో నటరాజన్ ఈ సంవత్సరం జరిగే టి20 వరల్డ్ కప్ కష్టతరమే అని అర్థమవుతుంది.
ఒకవైపు హైదరాబాద్ జట్టు నుంచి నటరాజన్ తప్పుకుంటే మరోవైపు మిడిల్ ఆర్డర్ బలహీనతతో గెలిచే మ్యాచ్ లలో కూడా ఓటమి పాలు అవుతుంది.ఇక ఐపీఎల్ భారం మొత్తం కూడా డేవిడ్ వార్నర్, బెయిర్ స్టో, కేన్ విలియమ్సన్ పై పడుతూ ఉంది.
ఇలా ఉండగా డేవిడ్ వార్నర్ కూడా స్థాయికి తగ్గ ప్రదర్శన మైదానంలో చూపించక పోవడంతో హైదరాబాద్ జట్టు పరాజయాలు ఎదురవుతున్నాయి.ఇప్పటి వరకు ఐదు మ్యాచులు ఆడిన ఎస్ఆర్ఎచ్ కూడా కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే విజయాన్ని కైవసం చేసుకుంది హైదరాబాద్ టీం.ఇదిలా ఉండగా గడిచిన ఆస్ట్రేలియా టి20 సిరీస్ లో నటరాజన్ అద్భుత ప్రదర్శన ఇచ్చాడు.ఈ క్రమంలోనే నటరాజన్ వన్డే సిరీస్, టెస్ట్ సిరీస్ లో కూడా చోటును సొంతం చేసుకొని తన సత్తా ఏంటో చాటుకున్నాడు.
నటరాజన్ అతి త్వరలో మైదానంలోకి అడుగుపెడుతానని తన భావనను వ్యక్తం చేశాడు.