ఇటీవల ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు వచ్చిన క్రమంలో లో రైస్ ఈ పార్టీ భారీ మెజార్టీతో గెలవడం తో ఏలూరు మేయర్ పదవి వార్ వన్ సైడ్ అయ్యింది.దాదాపు 47 స్థానాల్లో వైసీపీ గెలవడంతోఏలూరులో వైసీపీకి తిరుగులేదు అని రుజువయింది.
టీడీపీ మూడు స్థానాలకు పరిమితం అయింది.ఏలూరు కార్పొరేషన్ అయిన తర్వాత జరిగిన మూడో సారి ఎన్నికలలో వైసీపీ గెలవడంతో నూతన పాలక వర్గం కొలువుదీరింది.
మేయర్ గా నూర్జహాన్, డిప్యూటీ మేయర్లుగా జీ.శ్రీనివాసులు, ఎన్.సుధీర్ బాబు ఎన్నికయ్యారు.
2014 టైంలో మొట్టమొదటిసారి నూర్జహాన్మేయర్ పదవిని అధిరోహించారు.ఆ తర్వాత ఇటీవల జరిగిన కార్పొరేషన్ ఎన్నికలలో 50వ డివిజన్ లో గెలుపొందడంతో గత అనుభవాల దృష్ట్యా మరోసారి మేయర్ పదవిని అధిరోహించి పక్క ప్రణాళికలతో నగరాన్ని అభివృద్ధి చేయడానికి సిద్ధం అవుతున్నట్లు తెలిపారు.రాష్ట్ర వ్యాప్తంగా హోరాహోరీగా జరిగిన కార్పొరేషన్ ఎన్నికలలో ఏలూరు రిజల్ట్ చాలా లేట్ గా రావడంతో తీవ్ర ఉత్కంఠ రాజకీయ నేతలలో నెలకొనగా వైసీపీ పార్టీ తిరుగులేని విజయం సాధించడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
దీంతో రాష్ట్రవ్యాప్తంగా కార్పొరేషన్ స్థానాలలో వైసీపీ క్లీన్ స్వీప్ చేయడం జరిగింది.