టెంపర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం నాన్నకు ప్రేమతో.సుకుమార్ దర్శకత్వంలో బి.
వి.ఎస్.ఎన్.ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని చిత్రయూనిట్ డిసైడ్ చేసింది.అందులోభాగంగా సినిమా శరవేగంగా స్పెయిన్లో చిత్రీకరణను జరుపుకుంటుంది.
రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు విలన్గా నటిస్తున్నాడు.
తాజా సమచారం ప్రకారం ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమాన్ని డిసెంబర్ 20న గానీ లేదా 23న గానీ నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారట.
అయితే ఇక్కడొక విషయముంది డిసెంబర్ 20న గుంటూరులో బాలకృష్ణ, శ్రీవాస్ల డిక్టేటర్ ఆడియో ఉండటంతో నాన్నకు ప్రేమతో ఆడియో విడుదలను డిసెంబర్ 23న నిర్వహించే అవకాశం ఉంది.లేదా రెండు రోజులు వెనక్కి వెళ్లే ఛాన్స్ కూడా ఉంది.
ఒకవేళ హీరో ఎన్టీఆర్, నిర్మాత బివిఎస్.ఎన్ప్రసాద్ నిర్ణయం మార్చుకుంటే రెండు రోజులు ముందుకు వేడుక జరిగే ఛాన్సెస్ కనపడుతున్నాయి.
కానీ ప్రస్తుతం మాత్రం డిసెంబర్ 20 లేదా 23వ తేదిలే వినపడుతున్నాయి.