యంగ్ టైగర్ ఎన్టీఆర్ దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ సినిమాను పూర్తి చేసి విడుదలకు సిద్ధంగా ఉంచాడు.ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 7న సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ లో కూడా వేగం పెంచారు.
ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో తన 30వ సినిమాను స్టార్ట్ చేయబోతున్నాడు.
వచ్చే నెల ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి.
ఇక ఈ సినిమాను కొరటాల శివ భారీ స్థాయిలో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కించ బోతున్నాడు.ఇక ప్రెసెంట్ కొరటాల ఇతర నటీనటులనుఎంపిక చేస్తూ బిజీగా ఉండగా ఎన్టీఆర్ ఫ్యామిలీతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నాడు.
ఇక ఎన్టీఆర్ వెకేషన్ నుండి రాగానే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.
ఈ సినిమాను నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో మిక్కిలినేని సుధాకర్, ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ పై నిర్మించబోతున్నారు.ఈ సినిమా ఏప్రిల్ 29, 2022 న విడుదల చేయనున్నట్టు కూడా అప్పుడే ప్రకటించారు.ఇక ఈ సినిమా తర్వాత చేయబోయే సినిమా గురించి కూడా ఎన్టీఆర్ ఎప్పుడో ప్రకటించాడు.
ఈ సినిమా పూర్తి అవ్వగానే కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో #NTR31 చేయబోతున్నట్టు ప్రకటించారు.
ఇక ఈ సినిమా గురించి తాజాగా తారక్ మీడియాతో కొన్ని ఆసక్తికర విషయాలను తెలిపాడు.ఒక ఆంగ్ల మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ మాట్లాడుతూ.ప్రశాంత్ నీల్ తో చేయబోయే సినిమా వచ్చే ఏడాది అక్టోబర్ లో సెట్స్ మీదకు వెళ్లనుందని.
ఇక ఈ సినిమా కూడా కేజిఎఫ్ తరహాలోనే భారీ స్థాయిలో ఉండనుందని తారక్ తెలిపాడు.ప్రెసెంట్ ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఈ కామెంట్స్ విన్న నందమూరి అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ప్రెసెంట్ ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో సలార్ సినిమా తెరకెక్కిస్తున్నాడు.
ఈ సినిమా పూర్తి అవ్వగానే తారక్ తో సినిమాను స్టార్ట్ చేయబోతున్నాడు.