యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో మూవీ ఇండస్ట్రీ రికార్డులు బ్రేక్ అయ్యే కాన్సెప్ట్ తో తెరకెక్కుతోందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.కొరటాల శివ ఈ సినిమాకు దర్శకుడు కాగా తారక్ పై ఎంతో అభిమానం ఉన్న ఈ దర్శకుడు మరోసారి తానంటే ఏంటో ఈ సినిమాతో ప్రూవ్ చేసుకుంటానని గట్టి నమ్మకాన్ని కలిగి ఉన్నారు.
కొరటాల శివ ఈ సినిమా కోసం సముద్రాన్ని రీ క్రియేట్ చేయనున్నారని బోగట్టా.
ఈ సినిమాలో అబ్బురపరిచే సెట్స్ ఉంటాయని తెలుస్తోంది.
ఈ సినిమా కోసం ఎవరూ ఊహించని సెట్స్ వేయనున్నారనే వార్త ఫ్యాన్స్ కు ఒకవైపు సంతోషాన్ని కలిగిస్తుండగా మరోవైపు ఆశ్చర్యానికి గురి చేస్తోంది.ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ ఫిక్స్ అయినా రెమ్యునరేషన్, ఇతర కారణాల వల్ల ఆ విషయాలను వెల్లడించడానికి మేకర్స్ ఇష్టపడటం లేదని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

తారక్ కొరటాల శివ కాంబో మూవీ కోసం సాబు సిరిల్ పని చేస్తున్నారు.వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాను తెరకెక్కించనుండగా సముద్రంలో మెజారిటీ సన్నివేశాలు ఉండటంతో సెట్ వేసి గ్రాఫిక్స్ లో సముద్రాన్ని చూపించనున్నారని సమాచారం అందుతోంది.ఫిబ్రవరి ఫస్ట్ వీక్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూట్ మొదలుకానుందని తెలుస్తోంది.పోర్ట్ ఎన్విరాన్మెంట్ ఉండేలా ఈ సెట్ ఉంటుందని బోగట్టా.

ఈ సినిమా పూజా కార్యక్రమానికి మెగా ఫ్యామిలీకి చెందిన పలువురు క్రేజీ హీరోలు హాజరయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.ఆర్.ఆర్.ఆర్ సక్సెస్ తో మెగా హీరోలతో తారక్ కు అనుబంధం పెరిగింది.కొరటాల శివ ఈ సినిమాతో సక్సెస్ సాధిస్తేనే ఆయనకు సినిమా ఆఫర్లు అంతకంతకూ పెరిగే ఛాన్స్ ఉంటుంది.
.