యంగ్ టైగర్ ఎన్టీఆర్ 30వ సినిమా షూటింగ్ సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో ప్రారంభం అయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం ఇద్దరు ముద్దుగుమ్మలను పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది.
కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు సంబందించిన చిత్రీకరణ అతి త్వరలోనే ప్రారంభం కాబోతుంది.ప్రస్తుతం సినిమా షూటింగ్ కోసం సెట్స్ నిర్మాణం చేస్తున్నారు.
ఇదే సమయంలో సినిమా హీరోయిన్ ఎంపిక విషయంలో చర్చలు జరుపుతున్నట్లుగా సమాచారం అందుతోంది.ఈ సినిమా కోసం ఇద్దరు హీరోయిన్స్ ను సంప్రదిస్తున్నారు.
ఆ ఇద్దరు కూడా రామ్ చరణ్ కు జోడీగా నటించిన వారే అవ్వడం విశేషం.అదే కాకుండా ఇద్దరు కూడా బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకు పోతున్న వారు అవ్వడం ఇక్కడ చర్చనీయాంశం.
బాలీవుడ్ లో ఆలియా భట్ స్టార్ డమ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఆమె హీరోయిన్ గా ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ రూపొందుతోంది.రామ్ చరణ్ కు జోడీగా ఆ సినిమాలో నటించింది.సినిమాకు సంబంధించిన షూటింగ్ ముగించుకుని బాలీవుడ్ చెక్కేసిన ఆలియా మళ్లీ ఎన్టీఆర్ మూవీ కోసం వస్తుందేమో అంటూ అంతా ఆసక్తిగా ఉన్నారు.
ఒక వేళ ఆలియా భట్ కాకుంటే ఆమె స్థానంలో కియారా అద్వానీ అయినా నటించే అవకాశం ఉందని అంటున్నారు.ఈమె ఇప్పటికే వినయ విధేయ రామ సినిమా లో చరణ్ కు జోడీగా నటించింది.ఆ సినిమా విఫలం అయ్యింది.ప్రస్తుతం శంకర్ దర్శకత్వం లో చరణ్ చేయబోతున్న సినిమా కూ ఆమెనే ఎంపిక చేయడం జరిగింది.వీరిద్దరిలో ఎవరో ఒకరు పక్కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించడం ఖాయం అంటున్నారు.ఆలియా భట్ కు అయితే 5 నుండి 6 కోట్ల పారితోషికం.
కియారా కు 4 కోట్ల వరకు పారితోషికం ఇవ్వబోతున్నారట.