ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ను కన్ఫ్యూజన్‌లోకి నెట్టిన కేజీఎఫ్‌ డైరెక్టర్‌

కేజీఎఫ్‌ చిత్రంతో దేశ వ్యాప్తంగా మంచి క్రేజ్‌ను దక్కించుకున్న దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ ప్రస్తుతం కేజీఎఫ్‌ 2 చిత్రాన్ని తెరకెక్కించే పనిలో ఉన్నాడు.కేజీఎఫ్‌ 2 పూర్తి అయితే కొత్త సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.

 Nr With Kgf, Director Prashanth Nil, Kgf Director, Hero Prabhas-TeluguStop.com

సినిమా కరోనా కారణంగా ఆగిపోయింది.త్వరలో షూటింగ్‌ మొదలు పెట్టాలని భావిస్తున్న సమయంలో అనూహ్యంగా సంజయ్‌ దత్‌కు కరోనా పాజిటివ్‌ అంటూ నిర్థారణ అయ్యింది.

దాంతో కేజీఎఫ్‌ 2 చిత్రం పూర్తి అయ్యేందుకు చాలా సమయం పట్టే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కేజీఎఫ్‌ 2 తర్వాత ప్రశాంత్‌ నీల్‌ టాలీవుడ్‌ స్టార్‌ ఎన్టీఆర్‌ తో చేసే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

ఇలాంటి సమయంలో ప్రభాస్‌ మూవీ విషయంలో కూడా ప్రశాంత్‌ నీల్‌ స్పందించడం చర్చనీయాంశంగా ఉంది.ప్రభాస్‌తో ప్రశాంత్‌ నీల్‌ మూవీ యూవీ క్రియేషన్స్‌లో ఉంటుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ గందరగోళంకు గురవుతున్నారు.

ప్రభాస్‌ తో ముందు ఉంటుందా లేదంటే ఎన్టీఆర్‌కు సినిమా మొదట చేస్తాడా అంటూ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ ఆలోచనల్లో పడ్డారు.

ప్రభాస్‌ ప్రస్తుతం రాధే శ్యామ్‌ చిత్రాన్ని చేస్తున్నాడు.

ఆ తర్వాత నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో సినిమాను చేయబోతున్నాడు.ఈ రెండు సినిమాలు పూర్తి అయ్యి విడుదల అవ్వాలంటే కనీసం మూడు సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది.

కనుక ఖచ్చితంగా ప్రశాంత్‌ నీల్‌ అప్పటి వరకు వెయిట్‌ చేయక పోవచ్చు.అందుకే వీరిద్దరి కాంబో మూవీ కంటే ముందు ఎన్టీఆర్‌తో ప్రశాంత్‌ నీల్‌ మూవీ ఉంటుంది.

ఈ విషయంలో ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ ఎలాంటి గందరగోళంకు గురి కావల్సిన పని లేదు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube