నందమూరి కుటుంబంలో గొడవలు ఉన్నాయంటూ ఎప్పటి నుండో ప్రచారం జరుగుతుంది.ఎన్ని సార్లు ఖండించినా ఈ రూమర్స్ మాత్రం ఆగడం లేదు.
తాజాగా ఈ రూమర్స్ లో ఎలాంటి నిజం లేదని ఎన్టీఆర్ మరొకసారి క్లారిటీ ఇచ్చారు.రాజకీయాల కారణంగా వీరి మధ్య భేదాలు ఉన్నాయంటూ రూమర్స్ వినిపించాయి.
ఈ మధ్య తెలుగుదేశం పార్టీ ఎక్కడ సభలు జరిగిన అభిమానులు ఎన్టీఆర్ అంటూ అరవడం చాలా చోట్ల చూసాము.
అయితే ఈ పార్టీని ముందుకు తీసుకెళ్లే సత్తా ఒక్క ఎన్టీఆర్ కు మాత్రమే ఉందని చాలా మంది అభిప్రాయం.
ఎన్టీఆర్ ఎక్కడ కనిపించిన ఇప్పటికి చాలామంది అభిమానులు ఒకే ప్రశ్న వేస్తారు.మీరు రాజకీయాలలోకి ఎప్పుడు వస్తారు.అని.కానీ ఈ ప్రశ్నకు ఎన్టీఆర్ కూడా చాలా సున్నితంగా జవాబు చెబుతాడు.టిడిపి పార్టీ కి దూరం కాను.కానీ రాజకీయాల్లోకి మాత్రమూ రాను అని చెబుతుంటాడు.
అయితే బాబాయ్ బాలయ్యకు అబ్బాయి ఎన్టీఆర్ కు మధ్య విభేదాలు ఉన్నాయని చాలా మంది భావిస్తున్నారు.కానీ ఎన్టీఆర్ ఎప్పటికప్పుడు వీటిని కొట్టిపారేస్తూనే ఉంటాడు.
తాజాగా ఎన్టీఆర్ మరొకసారి తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని క్లారిటీ ఇచ్చినట్టు అయ్యింది.ఈ రోజు బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా బాలయ్య బాబాయ్ కు అబ్బాయి స్పెషల్ విషెష్ తెలుపుతూ ఒక పోస్ట్ షేర్ చేసారు.
దీంతో ఈ ట్వీట్ క్షణాల్లోనే వైరల్ అయ్యింది.దీంతో ప్రత్యర్థులకు ఇన్ డైరెక్ట్ గా క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తుంది.మరి ఇప్పటికైనా ఈ రూమర్స్ పై ప్రచారం ఆగుతుందో లేదో చూడాలి.ఇది ఇలా ఉండగా ఈ రోజు బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా అఖండ నుండి కొత్త పోస్టర్ విడుదల చేసారు.
ఇందులో బాలయ్య లుక్ సూపర్ ఉందంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.అంతేకాదు గోపీచంద్ మలినేని తో సినిమా చేస్తున్నట్టు కూడా ప్రకటించాడు.